Breaking News

చర్చిలో తొక్కిసలాట: ఫాస్టర్ చేతిలోని నూనె కోసం ఎగబడ్డ జనం.. 20 మంది మృతి


టాంజానియాలోని చోటుచేసుకుని 20 మంది మృతిచెందారు. కిలిమంజారో పర్వతం సమీపంలోని మోషే పట్టణంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మోషే పట్టణంలో పాస్టర్ బోనిఫేస్ మంపోసా అధ్వర్యంలో జరిగిన ప్రార్థనలకు భారీగా క్రైస్తవులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పాస్టర్ బోనిఫేస్ చేతిలో నూనెను పట్టుకుని ప్రార్థన నిర్వహించి, దానిని నేలపై పోశాడు. పవిత్రమైన ఈ నూనెను తాకితే మంచి జరుగుతుందని భావించిన జనం.. ముందుకు ఉరకడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది గాయపడ్డారు. మృతిచెందినవారిలో ఐదుగురు చిన్నారుల కూడా ఉన్నారని స్థానిక పోలీసులు తెలిపారు. రాత్రివేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వివరించారు. కాగా, తొక్కిసలాట చోటుచేసుకున్నా క్రైస్తవ మత ప్రబోధకుడు మాత్రం పట్టించుకోకుండా టాంజానియా తీర నగరం దార్ ఇస్ సలేం పట్టణంలోని మరో చర్చికి వెళ్లిపోయినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, దీనికి కొన్ని చర్చిలు ఆటంకం కలిగిస్తున్నాయని అన్నారు. ఆఫ్రికాలో ప్రజల పేదరికాన్ని అలుసుగా తీసుకుని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున్న పాస్టర్లు చెలరేగిపోతున్నారు. తాము అద్భుతాలు చేయగలమని, పేదరికం నుంచి బయటపడేస్తామని మాయమాటలు చెప్పి జనాలను మభ్యపెడుతున్నారు. సువార్త సభల పేరుతో ఆర్ధిక నేరాలు, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది దక్షిణాఫ్రికా నగరం ప్రిటోరియాలోని ఓ చర్చిలో తొక్కిసలాట చోటుచేసుకుని ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనలో ఆ చర్చి ఫాస్టర్ షెఫర్డ్ బుషీరిపై కేసు నమోదయ్యింది. ఆఫ్రికాలోనే అత్యంత ధనవంతుడైన క్రైస్తవ మత ప్రబోధకుడిగా ఈయనను పేర్కొంటారు. గతేడాది ఫిబ్రవరిలో బుషీరీపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదుచేశారు. దక్షిణాఫ్రికా నుంచి తన ప్రత్యేక విమానంలో డబ్బును అక్రమంగా తరలించిన మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


By February 03, 2020 at 11:25AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/more-than-20-killed-and-several-injured-in-church-stampede-after-pastor-pours-holy-oil-in-tanzania/articleshow/73892512.cms

No comments