Breaking News

టీడీపీకి మహిళా ఎమ్మెల్సీ షాక్.. బెంగళూరులో మకాం, బీజేపీ నేతలతో భేటీ?


శాసన మండలి రద్దుపై తీర్మానం నేపథ్యంలో శాసన సభకు దూరం కావాలని టీడీఎల్పీ నిర్ణయించింది. ఆదివారం జరిగిన టీడీఎల్పీ భేటీకి ఆరుగురు ఎమ్మెల్సీలు దూరమయ్యారు. వీరంతా చంద్రబాబుకు వివిధ కారణాలు చెప్పారు. కాగా, ఆఖరి నిమిషంలో శమంతకమణి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. తమ సమీప బంధువులు చనిపోయారని కేఈ ప్రభాకర్ చంద్రబాబుకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఇంట్లో శుభకార్యం ఉందని తిప్పేస్వామి చెప్పారు. విదేశాలకు వెళ్తున్నానని రామకృష్ణ చెప్పారు. కాగా వీరందరితో వైఎస్సార్సీపీ చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. సోమవారం ప్రారంభం అవుతున్న టీడీఎల్పీ సమావేశానికి కూడా దూరంగా అవుతారని తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడి మరణంతో సరస్వతమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో నగరి నుంచి తన కుమారుడు జగదీశ్‌ను పోటీ చేయించాలని ఆమె భావించారు. కానీ అధిష్టానం మాత్రం ఆమె పెద్ద కుమారుడి వైపు మొగ్గు చూపింది. దీంతో ఎన్నికల సమయంలో ఆమె సైలెంటయ్యారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు వియ్యంకుడు కట్టా సుబ్రమ్మణ్యం నాయుడు బెంగళూరులో బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బెంగళూరులో మకాం వేయడం ఆసక్తికరంగా మారింది.


By January 27, 2020 at 10:42AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/tdp-mlc-gali-saraswathamma-not-attending-party-legislative-meeting-reports/articleshow/73653883.cms

No comments