Breaking News

అబార్షన్ల గడువు పెంచిన కేంద్రం.. త్వరలోనే చట్ట సవరణలు


నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 20 వారాల్లోపు గర్భం ఉన్నవారు మాత్రమే చేయించుకోవచ్చు. ఈ గడువును ‘ప్రత్యేక విభాగం మహిళల’కు 24 వారాలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగెన్సీ చట్టంలో సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో.. జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. 1971 నాటి చట్టానికి సవరణలను పార్లమెంట్ ఆమోదిస్తే.. అత్యాచార బాధితులు, మైనర్లు, వైకల్యం కలిగిన మహిళలకు అబార్షన్ల విషయంలో ఊరట లభిస్తుంది. గరిష్టంగా 24వ వారంలోనూ అబార్షన్ చేయించుకునే వెసులుబాటు లభిస్తుంది. 20 వారాల్లోపు గర్భిణి అబార్షన్ చేయించుకోవడానికి ఒక డాక్టర్ అభిప్రాయం, 24 వారాల్లో గర్భవిచ్చిత్తికి ఇద్దరు డాక్టర్ల అభిప్రాయం తీసుకునేలా చట్టంలో సవరణలను ప్రతిపాదించారు. నూతన సవరణల ప్రకారం అబార్షన్ చేయించుకున్న మహిళ పేరును బహిర్గతం చేయకూడదు. అత్యాచారాలకు గురైన బాలికలు తొలి ఐదు నెలల గర్భం సమయంలో తాము గర్భం దాల్చామనే విషయాన్ని గ్రహించడం లేదని అందుకే అబార్షన్ కాలపరిమితిని 24 వారాలకు పెంచాలని నిర్ణయించామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఇలాంటి ఘటనల్లో బాధిత బాలికలు అబార్షన్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఘటనలు ఉన్నాయని ఆయన తెలిపారు. 2017లో ముంబైలో 32 వారాల గర్భిణిగా ఉన్న 13 ఏళ్ల బాలికకు అబార్షన్ చేయడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అబార్షన్ గడువును 24 వారాలకు పెంచుతున్నప్పటికీ.. కొందరు కోర్టును ఆశ్రయించాల్సి రావచ్చు. కానీ ఈ సంఖ్య తక్కువగా ఉంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా మంది ప్రాణాలను కాపాడొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


By January 30, 2020 at 09:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/abortion-time-limit-increased-from-20-weeks-to-24-weeks-union-cabinet-approves/articleshow/73755850.cms

No comments