Breaking News

ఉరి అమలుకు ఒక్కరోజు ముందు.. సుప్రీంలో నిర్భయ దోషి పిటిషన్, ఈసారి మరో ట్విస్ట్!


ఉరిశిక్ష అమలు తేదీ దగ్గరపడుతున్న వేళ.. చావును తప్పించుకోవడానికి నిర్భయ దోషులు తమ దగ్గరున్న అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటున్నారు. కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన తర్వాత ముగ్గురు దోషులు వేర్వేరుగా సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. వీటిని న్యాయస్థానం కొట్టి వేసింది. రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించారు. రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ముకేశ్ సింగ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా.. ధర్మాసనం దాన్ని కూడా కొట్టివేసింది. ఉరి అమలుకు ఒక్క రోజు ముందు నిర్భయ దోషుల్లో ఒకరైన సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. గతంలో తన జువైనల్ పిటిషన్‌ను కోట్టివేయడాన్ని సవాల్ చేస్తూ అతడు అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. 2012లో పారామెడికల్ విద్యార్థిని అయిన నిర్భయను రేప్ చేసే సమయానికి తాను మైనర్‌ను అని పవన్ వాదిస్తున్నాడు. ఇదే విషయమై గతంలో హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దాన్ని కొట్టివేసింది. నిర్భయ హత్యాచారం కేసులో ఆరుగురు దోషులుగా తేలగా.. వీరిలో ఒకరు మైనర్. అతడిని మూడేళ్లపాటు జువైనల్ హోంలో ఉంచారు. పవన్ గుప్తా కూడా తాను అప్పుడు మైనర్‌ని అని వాదిస్తున్నాడు. దోషుల్లో ఒకరైన రామ్ సింగ్ కేసు విచారణలో ఉండగానే జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వినయ్, అక్షయ్ థాకూర్, ముకేశ్ సింగ్, పవన్ గుప్తాలను ఫిబ్రవరి 1న ఉరితీయాలని న్యాయస్థానం ఆదేశించింది.


By January 31, 2020 at 11:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nirbhaya-case-convict-pawan-gupta-files-review-petition-in-supreme-court-challenging-scs-earlier-dismissal-of-his-juvenile-plea/articleshow/73794880.cms

No comments