Breaking News

నిరసనలు, హింస దేశ ప్రగతికి గొడ్డలిపెట్టు: బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు


పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పలు అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ కొత్త దశాబ్దంలో అన్ని రంగాల్లోనూ భారత్ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు, 17వ లోక్‌సభ పలు చారిత్రాత్మక నిర్ణయాల అమలుకు వేదికగా నిలిచింది. ఈ సభ ఏర్పడిన ఏడు నెలల్లోనే కీలక నిర్ణయాలను తీసుకుందని కేంద్రంపై ప్రశంసలు కురిపించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేసి, కేంద్రపాలిత ప్రాంతాలు విభజించడం చారిత్రాత్మకం.. అక్కడ అభివృద్ధి శరవేగంగా జరుతుందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370ను రద్దుచేయడం ద్వారా జమ్మూ కశ్మీర్ ప్రజలకు అన్ని సౌకర్యాలను సమకూర్చామని తెలిపారు. అల్ప సంఖ్యాక వర్గాల ఉపాధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టామన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి పలు చర్యలు తీసుకున్నామని, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా దేశంలోని 8 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరిందని అన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందన్నారు. అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లోనూ భారత్ ముందంజలో ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఐదు ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. 24 మంది పేదలకు బీమా సౌకర్యం కల్పించామని, ఈ ఏడాది కొత్తగా మరో 75 మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేయనున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాల్సి ఉందని, ప్రజలకు మేలుచేకూర్చే కొత్త కార్యక్రమాలను ప్రారంభించదని రాష్ట్రపతి వివరించారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ మూల మంత్రంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నవ భారత్ నిర్మాణానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అసోంలో బోడోల సమస్యల పరిష్కారానికి చర్చలు జరుతామని హామీ ఇచ్చారు. దివ్యాంగులకు ఇ-గుర్తింపు కార్డులు జారీచేశామన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదించి, గాంధీజీ కలలను సకారం చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నిరసనలు, హింసాత్మక ఘటనలు దేశ ప్రగతిని దెబ్బతీస్తాయని అన్నారు. అయితే, రాష్ట్రపతి ప్రసంగంలో సీఏఏను ప్రస్తావించడాన్ని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టే చంద్రయాన్-3, గగన్‌యాన్, ఆదిత్య మిషన్‌లకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అలాగే, పాకిస్థాన్‌లో మైనార్టీలపై జరుగుతోన్న హింసను రాష్ట్రపతి తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం సరైన చర్యలు తీసుకోవాలని కోరారు.


By January 31, 2020 at 12:04PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/president-ramnath-kovind-addresses-joint-sitting-of-both-houses-in-parliament/articleshow/73795069.cms

No comments