వైఎస్ విజయమ్మ, షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు

ఏపీ సీఎం మాతృమూర్తి విజయమ్మ, సోదరి షర్మిలకు సమన్లు జారీ చేసింది. ఎలక్షన్ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. పరకాలలో జరిగిన ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో వైఎస్ విజయమ్మతో పాటుగా షర్మిల పైనా కేసులు నమోదయ్యాయి. కొండా మురళీతోపాటు కొండా సురేఖపైనా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొండా సురేఖ దంపతులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. జనవరి 10న వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే సమన్లు అందకపోవడంతో వారు కోర్టు ముందు హాజరు కాలేదు. దీంతో మరొకసారి సమన్లు జారీ చేయాలని కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు నాంపల్లి కోర్టు వై.ఎస్. విజయమ్మ షర్మిలకు సమన్లు జారీ చేసింది. విజయవాడలో ఉన్న వైఎస్ విజయమ్మ, షర్మిలకు నాంపల్లి కోర్టు అధికారులు స్వయంగా సమన్లు అందజేయనున్నారు. ఫిబ్రవరి 14న వీరిద్దరూ తప్పకుండా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.
By January 31, 2020 at 11:09AM
No comments