Breaking News

పెళ్లయి ఏడేళ్లయినా పిల్లలు పుట్టడం లేదని.. భార్య గొంతు నులిమి


జిల్లా మండలంలో దారుణం జరిగింది. పిల్లలు పుట్టడం లేదన్న కారణంలో ఓ వ్యక్తి కట్టుకున్న భార్య ప్రాణాలు బలి తీసుకున్నాడు. డోన్‌ మండలం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన నాగజ్యోతి (26) భర్త సోమశేఖర్‌ చేతిలో దారుణహత్యకు గురైంది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భార్య గొంతు నులిమి చంపిన అతను ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు గొంతుకు చీర బిగించి ఫ్యాన్‌కు వేలాడదీశాడు. Also Read: కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన నాగజ్యోతికి సోమశేఖర్‌‌తో 2012లో వివాహం జరిగింది. పిల్లలు కలగడం లేదన్న కారణంతో అతడు భార్యను తరుచూ వేధించేవాడు. దీంతో ఆమె మూడేళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. అయితే నెలరోజుల క్రితం పెద్దమనుషుల మధ్య పంచాయతీ జరగడంతో భర్త దగ్గరకు వచ్చింది. సోమవారం తెల్లవారుజామున నిద్రపోతున్న నాగజ్యోతిని సోమశేఖర్ గొంతు నులిమి చంపేశాడు. ఫ్యాన్‌కు వేలాడదీసి భార్య ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. Also Read: అయితే దీనిపై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. సోమశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. అయితే సోమశేఖర్‌తో తన తండ్రి నాగరాజు సాయంతోనే నాగజ్యోతిని హత్య చేశాడని, దీంతో అతడిని కూడా అరెస్ట్ చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే సోమశేఖర్ భార్యను కాపురానికి తీసుకెళ్లి చంపేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగజ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి రామసుబ్బయ్య ఫిర్యాదు ఆధారంగా మృతురాలి భర్త, మామపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By January 15, 2020 at 07:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-brutally-kills-wife-in-kurnool-district/articleshow/73261699.cms

No comments