Breaking News

పచ్చని సంసారాన్ని చిదిమేసిన విధి.. భర్త, కుమార్తె మృతితో అనాథగా మారిన మహిళ


వారిద్దరి వేర్వేరు ప్రాంతాలు. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చారు. పనిచేసే చోట మనసులు కలిసి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి అనురాగానికి గుర్తుగా కుమార్తె పుట్టిన పాపను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే ఆ ఆనందం ఎన్నాళ్లో కొనసాగలేదు. వారి సంతోషాన్ని చూసి విధికే కన్నుకుట్టిందేమో. మూడు నెలల క్రితం కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. ఆ విషాదాన్ని ఎలాగోలా దిగమింగుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఇంటి యజమాని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అటు బిడ్డను, ఇటు భర్తనూ కోల్పోయిన ఆ మహిళ అనాథగా మారింది. Also Read: కర్ణాటకలోని ఎద్లూరు ప్రాంతానికి చెందిన కుర్వ అశోక్‌(34) తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఉత్కూరు మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన మంజును ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎస్పీఆర్‌ హిల్స్‌ సమీపంలో గల బీజేఆర్‌ నగర్‌లో నివాసముంటున్నారు. అశోక్‌ కారు డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో వారి కుమార్తె అనన్య(3) అక్టోబరు 24న అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో దంపతులు తీవ్రంగా కుంగిపోయారు. ఆ బాధ నుంచి తేరుకుంటుండగా రెండ్రోజుల క్రితం ఎస్పీఆర్‌ హిల్స్‌ నుంచి జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీ మీదుగా రోడ్‌ నంబరు 10 వరకు మార్నింగ్ వాక్‌కు వెళ్లిన అశోక్‌ను కారు ఢీకొట్టింది. Also Read: దీంతో స్థానికులు అతడిని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాసేపటికే అతడు కోమాలోకి వెళ్లిపోవడంతో అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అశోక్ మంగళవారం చనిపోయాడు. మూడు నెలల క్రితం కుమార్తెను, ఇప్పుడు భర్తను కోల్పోయిన మంజు రోదన అందరినీ కలచివేసింది. ఇద్దరినీ కోల్పోయి అనాథగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన సుశీల్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. Also Read:


By January 22, 2020 at 12:32PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tragedy-in-telangana-woman-life-daughter-and-husband-died-within-3-months/articleshow/73515094.cms

No comments