గ్రామ వలంటీర్పై అఘాయిత్యం.. ఆమె కేకలు వేయడంతో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మహిళలపై రోజుకొక దారుణం వెలుగులోకి వస్తోంది. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘దిశా’ చట్టం తీసుకొచ్చినా కామాంధులు తగ్గడం లేదు. ఈసారి ఏకంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే గ్రామ వలంటీర్పైనే ఓ కామాంధుడు అత్యాచార యత్నం చేశాడు. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. Also Read: మండలంలోని మిన్నెకల్లులో ఓ గ్రామ వలంటీర్పై అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణానికి చెందిన ఓ యువకుడు శుక్రవారం అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. గ్రామ సమీపంలోని చెరువు వాగు వద్ద బట్టలు ఉతికేందుకు మహిళా గ్రామ వలంటీర్ వెళ్లింది. ఆ సమయంలో యువకుడు అక్కడికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయమై బాధితురాలు తొలుత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడింది. అయితే కొందరు గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని రాజీ చేసుకున్నట్లు తెలుస్తోంది. Also Read:
By January 18, 2020 at 01:15PM
No comments