Breaking News

తిండి లేక చిక్కిశల్యమైన ఆఫ్రికన్ సఫారీలు.. కంటతటిపెట్టిస్తున్న ఫోటోలు


సూడాన్‌లోని అంతర్యుద్ధం లక్షలాది మంది పాలిట శాపంగా మారింది. కడుపు నింపుకోవడానికి నాలుగు మెతుకులు కూడా దొరకని దుస్థితితో మనుషులు అల్లాడిపోతుంటే, మూగజీవాలు కూడా బక్కచిక్కి శల్యమవుతున్నాయి. సరైన ఆహారం లేక ఎముకల గూడులా మారిపోతున్నాయి. మనుషులతో పాటు మూగజీవులా కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నాయి. సుడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని అల్-ఖురేషి అనే జూ పార్కులోని సింహాలకు కొన్ని వారాలుగా ఆహారం లేక ఆకలితో అలమటిస్తూ లేవనేని పరిస్థితిలో ఉన్నాయి. వాటికి చికిత్సకు మందులు కూడా లేకపోవడంతో ఆ మృగరాజుల మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. ఆ సింహాల పరిస్థితి చలించిపోయిన అనే ఓ జంతు ప్రేమికుడు.. తన వంతు సహాయం చేయాలని సంకల్పించాడు. అచేతనంగా ఉన్న ఆ సింహాల ఫోటోలను తీసి ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. ఆకలితో అలమటిస్తున్న సఫారీలకు చేతనైన సహాయం చేయాలని నెటిజన్లను కోరాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది స్పందించారు. సలీహ్ ప్రయత్నాన్ని అభినందించడమే కాదు, పార్కును సందర్శించి ఆ సింహాలకు ఆహారం రూపంలో, మందుల రూపంలో తమకు తోచిన సాయాన్ని చేశారు. అంతేకాదు, సింహాల పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించమని కోరుతున్నారు. జూ అధికారులు, వైద్యులు దీనిపై వివరణ ఇస్తూ.. గత కొన్ని వారాలుగా సింహాల పరిస్థితి క్షీణించిందని, ఇతర జంతువులు బరువు గణనీయంగా తగ్గాయని చెప్పారు. ఆహారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు కాబట్టి, ఇందు కోసం తమ సొంత డబ్బులను ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది జూపార్క్ మేనేజర్ ఎస్సామెల్డిన్ హజ్జర్ చెప్పారు. సింహాల ఇలా దయనీయ స్థితిలో రావడానికి నిర్వహణ సక్రమంగా లేకపోవడం కూడా ఓ కారణమని ఆయన అన్నారు. సింహాలు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాయని, దీనికి తోడు పోషకాహార లోపం ఉన్నట్లు కనిపిస్తోందని మోటాజ్ మహమూద్ అనే కేర్ టేకర్ వ్యాఖ్యానించారు.


By January 22, 2020 at 11:04AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pics-of-five-malnourished-african-lions-at-sudan-park-go-viral/articleshow/73512594.cms

No comments