Breaking News

కేటీఆర్ సెక్రటరీ పేరుతో అక్రమ వసూళ్ల... ఇద్దరు కేటుగాళ్ల అరెస్ట్


తెలంగాణ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. మల్కాజ్‌గిరిలోని గీతానగర్‌కు చెందిన రూపాకుల కార్తికేయ సీఏ చదివాడు. తార్నాకకు చెందిన స్నేహితుడు ఫ్రెడరిక్‌తో కలిసి ప్రైవేట్ కంపెనీలకు కన్సల్టెన్సీ వ్యవహరించేవాడు. వీరిద్దరూ ఆయా కంపెనీల పనిమీద రోజూ ప్రభుత్వాధికారులను కలుస్తూ అక్కడ జరిగే ప్రక్రియలను తెలుసుకునేవారు. Also Read: ఈ క్రమంలోనే సులువుగా డబ్బు సంపాదించుకునేందుకు మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి పేరుతో కార్తికేయ నకిలీ అవతారమెత్తాడు. మారేడ్‌పల్లిలోని కస్తూర్బాగాంధీ మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాములరాజును పరిచయం చేసుకుని తన ఫ్రెండ్ కుమార్తెకు అందులో సీటు ఇప్పించాడు. ఇందుకోస స్నేహితుడి దగ్గర రూ.90వేలు తీసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత కార్తికేయకు ఫోన్ చేసిన శ్రీరాముల రాజు తన కుమారుడిని అనారోగ్యంతో ఆస్పత్రిలో చేర్పించామని, ప్రభుత్వం నుంచి వైద్య ఖర్చులు ఇప్పించాలని కోరాడు. Also Read: దీనికి సరేనన్న కార్తికేయ సీఎం పేషీ నుంచి తెచ్చినట్లు రూ.2లక్షల వైద్య ఖర్చుల ట్రీట్‌మెంట్ లెటర్‌ను శ్రీరాముల రాజుకు ఇచ్చి కొంత కమిషన్ తీసుకున్నాడు. రాజు ఆ లెటర్‌ను శ్రీకర్ ఆస్పత్రిలో ఇవ్వగా అది నకిలీదని తేలింది. దీంతో బాధితుడు ఈ నెల 6వ తేదీ ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కార్తికేయ, అతడి ఫ్రెండ్ ఫ్రెడరిక్‌ను అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. Also Read:


By December 12, 2019 at 11:47AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-men-arrested-for-cheating-of-fraud-in-name-of-ktr-secretary-in-hyderabad/articleshow/72486142.cms

No comments