సోదరిపై అత్యాచారం చేయించి, హత్య.. నలుగురికి జీవిత ఖైదు!

ఆరేళ్ల క్రితం ఓ మహిళపై అత్యాచారం చేసి, హతమార్చిన కేసులో నలుగురికి పడింది. ఈ మేరకు మార్కాపురం అదనపు జిల్లా జడ్జి జి.రామకృష్ణ శుక్రవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. భూచేపల్లి నాగరత్నమ్మ, రావూరి మంగమ్మ అక్కాచెల్లెళ్లు. భూచేపల్లి నాగరత్నమ్మ చీమకుర్తి మండలం దేవరపల్లిలో ఉండేది. అయితే అక్కచెల్లెళ్ల మధ్య మధ్య ఆస్తి వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మంగమ్మ భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే దీనికి నాగరత్నమ్మే కారణమని భావించిన మంగమ్మ.. సోదరిని హతమార్చేందుకు ప్రణాళిక రూపొందించింది. Also Read: తోడుకు రమ్మని పిలిచి.. భర్త చనిపోయినందున ఆలయంలో నిద్ర చేసేందుకు తోడు రావాలని మంగమ్మ తన సోదరి నాగరత్నమ్మను కోరింది. దీంతో నాగరత్నమ్మ ఆమె వెంట వెళ్లింది. అయితే ముందస్తు ప్రణాళికలో భాగంగా పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం వద్ద నాగదాసరి వెంకటయ్య నాగరత్నమ్మపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఏడుగురు కలిసి ఆమెను హత్య చేశారు. Also Read: దోషులుగా తేలింది నలుగురే..ఈ కేసులో నాగరత్నమ్మ సోదరి రావూరి మంగమ్మ, మీసాల నాగేంద్రం అలియాస్ నాగిరెడ్డి, మందగలం బాబు, నాగదాసరి వెంకటయ్యతో పాటు మరో ముగ్గురిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. వీరిలో నలుగురు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన మార్కాపురం అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.రామకృష్ణ.. నాగరత్నమ్మపై అత్యాచారం చేసిన నాగదాసరి వెంకటయ్యకు పదేళ్ల జైలు శిక్షతో పాటు ఆమెను హతమార్చినందుకు జీవిత ఖైదు విధించారు. అలాగే హత్యకు ప్రధాన సూత్రధారి అయిన మంగమ్మ, మీసాల నాగేంద్రం, మందగలం బాబుకు జీవిత ఖైదు విధించారు. మిగిలిన ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేశారు.
By December 07, 2019 at 12:26PM
No comments