దిశ నిందితుల్ని ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలి.. సుప్రీంలో పిటిషన్

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ ఎన్కౌంటర్ ఘటన సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్కౌంటర్పై దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలయ్యింది. ఈ ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై కేసు నమోదు సి.. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు లాయర్లు ఈ పిటిషన్ వేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. వెంటనే దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో ప్రస్తావించారు. సుప్రీంకోర్టు 2014లో ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని.. అందుకే చర్యలు తీసుకోవాలని ఇద్దరు లాయర్లు పిటిషన్లో కోరారు. Read Also: ఇటు మానవహక్కుల సంఘం కూడా ఈ ఎన్కౌంటర్ను సుమోటోగా స్వీకరించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా విచారణకు సిద్ధమయ్యింది.. ఎన్హెచ్ఆర్సీ సభ్యుల టీమ్ హైదరాబాద్ వచ్చింది. అత్యాచార ఘటన జరిగిన తొండుపల్లి.. నిందితుల ఎన్కౌంటర్ జరిగిన స్పాట్లను పరిశీలిస్తారు. అలాగే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న నలుగురి మృతదేహాలను పరిశీలిస్తారు.. అనంతరం ఈ ఎన్కౌంటర్ ఘటనపై నివేదిక అందించనున్నారు. ఇటు ఎన్కౌంటర్పై హైకోర్టు కూడా స్పందించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో మృతదేహాలను మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోలీసులు భద్రపరిచారు. తాజా ఘటనపై ఈనెల 9న హైకోర్టు విచారణ జరపనుంది. ఆ తర్వాతే డెడ్బాడీలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.
By December 07, 2019 at 12:23PM
No comments