‘దిశ’ హత్యాచారం... ఫోరెన్సిన్ నివేదికలో సంచలన విషయాలు

దేశాన్నే కుదిపేసిన ‘దిశ’ హత్యాచారం కేసులో కీలక ఆధారాలు సేకరించారు. ‘దిశ’ ఆ నలుగురు కామాంధులే అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. దిశను నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత దహనం చేశారని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నివేదిక నిర్ధారించినట్లు తెలుస్తోంది. కాలిపోయిన ఆమె శరీరం స్టెర్నమ్ బోన్ నుంచి సేకరించిన డీఎన్ఏ రిపోర్టు ప్రకాశం ఆ మృతదేహం ఆమెదేనని నిర్ధారణ చేశారు. ఈ కేసులో కీలకంగా మారిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగానే నిజానిజాలు నిర్ధారణ కానున్నాయి. Also Read: నలుగురు నిందితులు ఘటనాస్థలంలోనే ‘దిశ’పై అత్యాచారం చేసినట్లుగా స్పష్టమైన ఫోరెన్సిక్ ఆధారాలు లభించాయి. ఘటనా స్థలంలో సేకరించిన దిశ లోదుస్తులు, స్కార్ఫ్పై నిందితుల స్ఫెర్మ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నివేదిక ఆధారంగా విచారణ కమిటీ దర్యాప్తు వేగవంతం చేయనుంది. కోర్టు విచారణలో భాగంగా పోలీసులు ఆ నివేదికను షాద్నగర్లోని ఫాస్ట్ట్రాక్ కోర్టుకు అందజేయనున్నారు. వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు నిందితులు చటాన్పల్లి వద్ద పాశవికంగా అత్యాచారం చేసి, హత్యకు పాల్పడి దహనం చేసిన విషయం తెలిసిందే. Also Read: ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆ కామాంధులను బహిరంగంగా ఉరి తీయాలంటూ అన్ని వర్గాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు నిందితులను చటాన్పల్లిలోని సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ నిందితులు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కుని తప్పించుకునేందుకు యత్నించి ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. Also Read:
By December 13, 2019 at 11:59AM
No comments