Breaking News

పరీక్షల భయంతో కిడ్నాప్ డ్రామా.. హైదరాబాద్ యువతి కన్నింగ్ ప్లాన్


పరీక్షల రాయకుండా తప్పించుకునేందుకు ఓ డిగ్రీ విద్యార్థిని వేసిన ప్లాన్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఎల్బీనగర్‌కు చెందిన ఓ యువతి 10 రోజుల కిందత తల్లిదండ్రులతో కలిసి ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయానికి వచ్చింది. తాను కాలేజీ నుంచి వస్తుంటే నలుగురు వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారని, అరగంట తర్వాత తన మెడలోని బంగారు చైన్ లాక్కుని వదిలేసి వెళ్లిపోయారని ఫిర్యాదు చేసింది. Also Read: ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బృందాలుగా విడిపోయి దర్యాప్తును ప్రారంభించారు. యువతి చెప్పిన వివరాల ఆధారంగా అనేక కోణాల్లో విచారణ చేపట్టారు. యువతి చెప్పిన ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. ఎందులోనూ యువతి చెప్పిన కారు కనిపించలేదు. అదే పుటేజీలో యువతి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. Also Read: దీంతో ఆ యువతి పైనే పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఆమెను మరోసారి స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించగా షాకింగ్ విషయాలు చెప్పింది. డిగ్రీ పరీక్షలు రాయకుండా తప్పించుకునేందుకే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు యువతి చెప్పడంతో పోలీసులు మందలించి ఇంటికి పంపేశారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను పిలిపించి కుమార్తె చేసిన నిర్వాకాన్ని చెప్పడంతో వారు షాకయ్యారు. పిల్లలను చదువు పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తే ఇలాంటి పనులే చేస్తారని పోలీసులు వారిని హెచ్చరించారు. Also Read:


By December 16, 2019 at 10:32AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-degree-student-pretext-kidnap-drama-for-dropping-exams/articleshow/72733186.cms

No comments