సమత ఇంట్లో మరో విషాదం.. కోడలిపై అఘాయిత్యాన్ని తట్టుకోలేక

కుమురం భీం జిల్లా రాంనాయక్ తండా సమీపంలో గత నెల 24న ముగ్గురు కామాంధుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఆమె మామ(భర్త తండ్రి) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. సమత మృతితో షాక్లోకి వెళ్లిపోయిన ఆయన అప్పటి నుంచి ముభావంగా కనిపిస్తున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. Also Read: కోడలు తనను ఎంతో బాగా చూసుకునేదని, ఇంటికి వచ్చిన ప్రతిసారీ సపర్యలు చేసి ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చేదని సమత మామ తమతో చెప్పేవాడని గ్రామస్థులు చెబుతున్నారు. కోడలిపై ఇంత ఘోరం జరగడంతో ఆయన తట్టుకోలేకపోయాడని, అప్పటి నుంచి సక్రమంగా ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. Also Read: ఈ క్రమంలోనే ఆయన శనివారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు వచ్చిందని, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. అసలే సమతపై జరిగిన ఘోరంపై కన్నీరుమున్నీరవుతున్న ఆ కుటుంబాన్ని ఆమె మామ మృతి మరింత కుంగదీస్తోంది. Also Read:
By December 15, 2019 at 09:21AM
No comments