Breaking News

కార్గిల్‌ యుద్ధంలో కీలక పాత్రపోషించి పాక్‌ను హడలెత్తించిన ఆ విమానాలకు వీడ్కోలు!


నాలుగు దశాబ్దాలుపాటు వైమానిక దళంలో కీలక పాత్ర పోషించిన మిగ్-27 యుద్ధ విమానాలు ఇక కనమరుగు కానున్నాయి. ఈ విమానం చివరిసారిగా జోధ్‌పూర్ వైమానిక స్థావరం నుంచి శనివారం ఎగరనుంది. వైమానిక దళంలోని శక్తిమంతమైన మిగ్‌-27 యుద్ధవిమానం ఇక చరిత్రగానే మిగిలిపోనుంది. 1999 నాటి కార్గిల్‌ యుద్ధం సందర్భంగా ఆపరేషన్ సేఫ్‌డ్ సాగర్‌లో కీలకంగా వ్యవహరించిన మిగ్-27కు వాయుసేన శుక్రవారం వీడ్కోలు పలకనుంది. జోధ్‌పుర్‌ వైమానిక స్థావరం నుంచి ఏడు మిగ్‌-27లు చివరిసారిగా గగనవిహారం చేస్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధవిమానాల ప్రస్థానానికి ముగింపు పడుతుంది. ప్రస్తుతం ఏ దేశంలోనూ ఇవి వినియోగంలో లేవు. ఈ కార్యక్రమానికి ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా సహా పలువురు హాజరుకానున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జోధ్‌పూర్‌లో 29వ స్వ్కాడ్రన్‌కు చెందిన సిబ్బంది మిగ్ 27 బహదూర్‌ను చివరిసారిగా నడపనున్నారు. ఈ విమానాల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టనున్నారు. మిగ్ 27 యుద్ధ విమానాలను దశలవారిగా నుంచి తొలగిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో జోధ్‌పూర్ వైమానిక స్థావరం నుంచి, మూడేళ్ల కిందట పశ్చిమ బెంగాల్‌లోని హసీమారాలో మరో రెండింటిని తొలగించారు. ఈ విమానాలను 1981లో నాటి సోవియట్ యూనియన్ నుంచి కొనుగోలు చేశారు. గాల్లోని నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే ఈ విమానాలు 38 ఏళ్లపాటు విశిష్ట సేవలు అందించాయి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మొత్తం 167 మిగ్ 27 విమానాలను రూపొందించగా, తర్వాత 80 విమానాలను అధునీకరించింది. గంటలకు 1,700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మిగ్ యుద్ధ విమానాలకు 4000 కిలోల బరువైన పేలోడ్లను తీసుకెళ్లే సామర్థ్యం సొంతం. అయితే, ఇటీవల కాలంలో మిగ్ -27 ప్రమాదాలు తరుచూ చోటుచేసుకోవడంతో వీటి పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా నుంచి తీసుకొచ్చిన మిగ్‌లు సరిగా పని చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇకపై రష్యా నుంచి ఎలాంటి యుద్ధ విమానాలు కొనుగోలు చేయరాదనే అభిప్రాయం వైమానిక దళ అధికారుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటి వరకు చాలా యుద్ధ విమానాలు కుప్పకూలిపోయాయి.


By December 26, 2019 at 09:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-air-force-its-farewell-mig-27-fighter-jet-after-4-decades-of-service/articleshow/72974413.cms

No comments