మరో ‘దిశ’: మైనర్ బాలికపై అత్యచారం, హత్య.. ఒడిశాలో హైటెన్షన్!

16 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక చేసి హత్యకు పాల్పడ్డారు.. కొందరు మృగాళ్లు. రాష్ట్రంలోని నబరంగ్పూర్ జిల్లాలో శనివారం ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం దావానంలా వ్యాపించడంతో రోడ్లెక్కిన ప్రజలు.. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగడంతో ఒడిశా రాష్ట్రంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బహిర్భూమికి వెళ్లి..జిల్లాలోని గుముండల గ్రామంలో శుక్రవారం రాత్రి దియాలి పర్వ్ జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న బాలిక రాత్రికి ఇంటికి చేరింది. అయితే రాత్రి 8 గంటల సమయంలో బహిర్భూమి కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. ఎంతసేపటికీ బాలిక రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గ్రామం మొత్తం జల్లెడపట్టారు. అయినా బాలిక ఆచూకీ కానరాలేదు. Also Read: విగతజీవిగా తేలి..శనివారం ఉదయం గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు పనుల నిమిత్తం వెళ్లగా.. గ్రామానికి అర కిలోవీుటర్ దూరంలోని ఓ పొలంలో బాలిక మృతదేహం ఉండడాన్ని గమనించారు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు బాలికను గుర్తించి.. ఆమె తల్లిదండ్రులకు తెలియపరియారు. అయితే బాలిక మృతదేహానికి కొంత దూరంలో రెండు జీన్ ఫ్యాంట్లు, చెప్పులు పడి ఉండడం, అలాగే బాలిక శరీరంపై కూడా అక్కడక్కడ గాయాలై ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: రాష్ట్రంలో ఉద్రిక్తత..ఇదే విషయంపై బాధిత బాలిక కుటుంబ సభ్యులు కొశాగుమడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన కొశాగుమడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. బాలికపై సామూహిక అత్యాచారం, హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. బాలికపై అత్యాచార ఘటన రాష్ట్రమంతటా వ్యాపించడంతో ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆందోళనలతో కోసగుముడ ప్రాంతంలో వ్యాపారులు దుకాణాలు మూసేశారు. విపక్ష పార్టీలు సైతం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డీజీపీ జిల్లా పర్యటనకు వచ్చిన రోజునే..రాష్ట్ర డీజీపీగా ఇటీవల నియమితులైన అభయ్ కుమార్ జిల్లాలో మొదటిసారిగా పర్యటనకు విచ్చేసిన రోజునే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొరాపుట్, మల్కన్గిరి జిల్లాల్లో శాంతిభద్రతలపై అధికారులతో డీజీపీ చర్చలు జరుపుతుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై డీజీపీ అభయ్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. Also Read:
By December 15, 2019 at 01:12PM
No comments