Breaking News

యూపీ, ఢిల్లీ పోలీసులూ తెలంగాణ పోలీసుల్ని చూసి నేర్చుకోండి.. ఎన్‌కౌంటర్‌పై మాయా ప్రశంసలు


వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పోలీసుల చర్యను సోషల్‌మీడియా వేదికగా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా, ఎన్‌కౌంటర్‌‌ను బీఎస్పీ అధినేత్రి సమర్థించారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులపై ఆమె విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నప్పటికీ సర్కారు నిద్రపోతోందని దుయ్యబట్టారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఉత్తర్‌ ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకుండా మొద్ద నిద్రపోతోందని విమర్శించారు. హైదరాబాద్ పోలీసులను చూసి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులు నేర్చుకోవాలని ఆమె సూచించారు. అయితే, యూపీలో మాత్రం దురదృష్టవశాత్తూ నేరగాళ్లను అతిథులుగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో జంగల్ రాజ్ కొనసాగుతోందని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, దిశ హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం సమర్థనీయమే అని సీపీఐ నేత నారాయణ అన్నారు. అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి శిక్షలు సమర్థనీయమే అని చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌ను సీపీఐ సమర్థిస్తోందని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసులో నిందితులను శుక్రవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. కేసును రీ కనస్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై నిందితులు రాళ్లు రువ్వి తప్పించుకునేందుకు ప్రయత్నించిగా నలుగురిపై కాల్పులు జరిపారు. దీంతో నిందితులు ఘటనా స్థలిలో హతమయ్యారు. దిశను ఎక్కడైతే పెట్రోలుపోసి నిప్పటించారో అక్కడే నిందితులు హతమయ్యారు.


By December 06, 2019 at 10:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bsp-chief-mayawati-responds-on-disha-accused-encounter-praises-telangana-police/articleshow/72394850.cms

No comments