నెల్లూరు జిల్లాలో దారుణం.. వివాహితను గదిలోకి లాగి గ్రామ వాలంటీర్ అఘాయిత్యం

జిల్లా కలిగిరి మండలంలోని ఓ గ్రామంలో మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రైతు భరోసా పథకానికి సంబంధించి ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకం, పొలం పట్టా నకలు ప్రతులు తేవాలని కలిగిరి మండలానికి చెందిన ఓ గ్రామ వాలంటీర్ సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో మహిళకు ఫోన్ చేసి చెప్పాడు. Also Read: దీంతో రాత్రివేళ ఒంటరిగా వాలంటీర్ ఇంటికి వెళ్లింది. పత్రాలన్నీ సమర్పించిన తర్వాత అతడికి కొన్ని వివరాలు చెప్పి ఆ మహిళ ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో మహిళ చేయి పట్టుకుని గదిలోక లాగిన వాలంటీర్ తలుపులు మూసేసి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. తన కోరిక తీరిస్తే ప్రభుత్వం పరంగా అందే అన్ని పనులు చేసి పెడతానని మహిళను ప్రలోభపెట్టాడు. అతడిని తీవ్రంగా వారించిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో భయపడి ఆమెను వదిలేశాడు. Also Read: దీంతో బాధితురాలు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది. భర్త వ్యక్తిగత పనుల నిమిత్తం చెన్నైకి వెళ్లడంతో ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో మంగళవారం ఉదయానికి ఇంటికి చేరుకున్న అతడు భార్యతో కలిసి కలిగిరి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ ఆదిలక్ష్మి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. Also Read:
By December 11, 2019 at 11:40AM
No comments