Breaking News

‘హన్మకొండ’ హత్యాచార ఘటనలో భయం రేకెత్తించే దారుణాలు వెలుగులోకి..


తెలంగాణలోని హన్మకొండలో జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో భయంగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నవంబర్ 27న యువతి పుట్టిన రోజు నాడే ఆమె క్లాస్‌మేట్ అత్యాచారానికి పాల్పడి హత్య చేసి రోడ్డు పక్కన పడేసి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ ప్రారంభించగా.. సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. యువతి హత్యాచారంపై ఆమె తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా కొత్త విషయాలకు బయటకు వస్తున్నాయి. ముమ్మాటికీ అత్యాచారం, హత్యే..నవంబర్ 27న తన పుట్టిన రోజు నాడు బయటకు వెళ్లిన యువతి అత్యాచారం, హత్యకు గురి కావడం.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు పులి సాయిగౌడ్‌ అలియాస్‌ సాయికుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. పోలీసులు ఈ యువతిది హత్యగా పేర్కొన్నప్పటికీ.. రక్తస్రావం వల్ల ఆమె మరణించి ఉండొచ్చన్న ప్రచారం జరిగింది. ఈ దిశగా విచారణ చేసిన పోలీసులు చివరికి ముమ్మాటికీ అత్యాచారం, హత్యేనని నిర్ధారణకు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. Also Read: నిందితుడి పక్కా ప్లాన్‌.. ప్రతిఘటించిన యువతిఅత్యాచారానికి ముందు యువతిని నిందితుడు సాయికుమార్‌ చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. నిందితుడు పక్కా ప్రణాళికతోనే బలవంతంగా యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడగా, ఆమె తీవ్రంగా ప్రతిఘటించిందని సమాచారం. దీంతో నిందితుడు ఆమెను చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం సందర్భంగా గుర్తించినట్లు తెలిసింది. అఘాయిత్యంపై యువతి ప్రతిఘటించే క్రమంలో ఆమె రెండు చేతులకు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. అలాగే, ఆమెపై తలపై సైతం బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలు కావడంతో పాటు రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు గుర్తించారు. అమానవీయంగా అత్యాచారం..యువతిపై అత్యాచారం అత్యంత అమానవీయంగా జరిగిందని వైద్యులు గుర్తించినట్లు తెలిసింది. మానసకు తీవ్రంగా రక్తస్రావం జరిగిందని తేల్చారని సమాచారం. దీనిపై పూర్తిగా నిర్ధారించుకునేందుకు సెమెన్‌ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి అందే నివేదిక ఆధారంగా అత్యాచారం ఘటనలో ఒకరు లేదా అంతకు మించి ఉన్నారా అని నిర్ధారించనున్నట్లు సమాచారం. యువతి అత్యాచారం ఘటనలో పోలీసులు పులి సాయికుమార్‌ను అరెస్టు చేయగా.. దీని వెనుక ఇంకెవరైనా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా కేసులో స్పష్టత వస్తుందని, అపోహలు తొలగిపోతాయని వైద్యులు పేర్కొంటున్నారు. Also Read: కాల్ డేటా ఆధారంగా మరో ముగ్గురి విచారణ ఈ కేసులో సాయికుమార్‌ అరెస్టుకు ముందు యువతి ‘కాల్‌ డేటా’ ఆధారంగా ముగ్గురు ఉన్నతాధికారుల డ్రైవర్లు, అటెండర్లను కూడా పోలీసులు విచారించినట్లు తెలిసింది. అధికారుల ఇళ్లకు కూరగాయలు పంపడానికి సంబంధించి వీరి కాల్స్‌ యువతి ఫోన్‌లో ఉండటంతో అనుమానించిన పోలీసులు ఈ కోణంలోనూ విచారణ జరిపినట్లు సమాచారం. అయితే ఈ కేసులో మరిన్ని కీలకాంశాలు వెలుగుచూసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. Also Read:


By December 11, 2019 at 01:23PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hanamkonda-rape-murder-case-police-identified-new-angle/articleshow/72470255.cms

No comments