Breaking News

‘నీ శీలం పోయింది.. చచ్చిపో’.. బాలికకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చిన ప్రియుడు


కామాంధుడి చేతిలో నలిగిపోయిన బాధితురాలు ప్రియుడి వేధింపులతో మరింత నలిగిపోయింది. ఆపద సమయంలో అండగా నిలవాల్సిన వాడే ఆమెను మరింత వేధించాడు. దీంతో తట్టుకోలేకపోయిన బాలిక చివరికి బలవన్మరణానికి పాల్పడింది. జిల్లా టి.నరసాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. Also Read: ఈ నెల ఏడో తేదీన రాత్రి సమయంలో ఆలయంలో జరిగిన భజన కార్యక్రమానికి హాజరై ఒంటరిగా తిరిగి వెళ్తోంది. ఆ సమయంలో బాలికపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన మానికల రాజు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. అయితే బాధితురాలు ఈ విషయాన్ని తన ప్రియుడు మామిళ్ల సుబ్రహ్మణ్యానికి తెలిపింది. Also Read: దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుబ్రహ్మణ్యం బాలికతో నీచంగా ప్రవర్తించాడు. ‘నీ శీలం పోయింది. చెడిపోవావ్. బతికుండటం వేస్ట్.. చచ్చిపో’ అంటూ వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే ఈ నెల 9వ తేదీన కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. అది తాగిన తర్వాత స్కూల్‌కి వెళ్లిన బాలిక అక్కడే నురగలు కక్కుకుంటూ అపస్మారకస్థితికి వెళ్లిపోయింది. జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం గుంటూరుకు తరలిస్తుండగా చనిపోయింది. ఈ ఘటనపై బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో చింతలపూడి పోలీసులు రాజు, సుబ్రహ్మణ్యంలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By December 16, 2019 at 09:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/boy-friend-gives-poision-to-minor-girl-rape-victim-died-in-west-godavari-district/articleshow/72730033.cms

No comments