ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్.. హైదరాబాద్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు

హైదరాబాద్లోని పాతబస్తీ దూద్బౌలికి చెందిన ఇంటర్ విద్యార్థిని మంగళవారం కిడ్నాప్ కావడం కలకలం రేపింది. దూద్బౌలికి చెందిన బాలిక నారాయణగూడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమెను ఉదయం తన తండ్రి కాలేజీ వద్ద వదిలి ఆఫీసుకి వెళుతుంటాడు. సాయంత్రం తల్లి కాలేజీకి వెళ్లి ఇంటికి తీసుకొస్తుంటుంది. మంగళవారం సాయంత్రం తన కుమార్తెను ఇంటికి తీసుకురావడానికి తల్లి కాలేజీకి వెళ్లగా ఓ యువకుడు ఆ బాలికను బలవంతంగా బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడు. Also Read: దీంతో ఆందోళన పడిన ఆమె తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆమె వెంటనే ఇంటికి చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా కుమార్తె ఆచూకీ దొరకలేదు. దీంతో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వారు కామాటిపురా పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది దూద్బౌలి హుస్సేనిఆలంలోని దినేష్(22)గా భావిస్తున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. Also Read: బాలిక కిడ్నాప్ నారాయణగూడలో జరిగినప్పటికీ కామాటిపురా ఇన్స్పెక్టరు జి.రాంబాబు ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు చేశారు. దర్యాప్తు నిమిత్తం ఈ కేసును నారాయణగూడ పీఎస్కు బదిలీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులు పీఎస్కు వస్తే గతంలో అది తమ పరిధిలో లేదని పోలీసులు తిప్పి పంపించేవారు. అయితే ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. Also Read:
By December 12, 2019 at 09:21AM
No comments