Breaking News

మహిళపై 36ఏళ్ల పాటు అత్యాచారం.. 15ఏళ్లకే మూడు అబార్షన్లు.. మేనమామ కీచకపర్వం


దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు హెచ్చుమీరుతున్న సమయంలోనే ఢిల్లీలో మరో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై సొంత మేనమామే 36ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న అత్యంత నీచమైన ఘటన బయటపడింది. తనకు నాలుగేళ్ల వయసున్నప్పటి నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడని, ఇకనైనా తనకు ఆ కామాంధుడి బారి నుంచి రక్షణ కల్పించాలంటూ బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. Also Read: తనకు నాలుగేళ్ల వయసున్నప్పుడు 1981లో మేనమామ తొలిసారి అత్యాచారానికి పాల్పడ్డాడని, పదో తరగతికి వచ్చేసరికే తనకు మూడుసార్లు అబార్షన్ చేయించాడని బాధితురాలు కోర్టుకు తెలిపింది. ఇదే విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెబితే తననే తిట్టారని, ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని పేర్కొంది. తనకు వివాహం అయిన తర్వాత కూడా అతడి వేధింపులు ఆగలేదని, 2014లో తాను భర్త నుంచి విడాకులు తీసుకున్నాక ప్రతిరోజూ లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు కోర్టుకు తెలిపింది. Also Read: మేనమామపై తాను 2016లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అదే ఏడాది తన తల్లి మరణిస్తే కక్షతో చివరిచూపు చూడటానికి కూడా అనుమతించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మేనమామపై ఫిర్యాదు చేసినందుకు కుటుంబసభ్యులు కూడా తనను బెదిరించారని తెలిపింది. మేనమామ కుమారులు కూడా తనను వేధింపులకు గురిచేశారని తెలిపింది. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చిన సందర్భంగా జడ్జి ఉమెద్ సింగ్ గ్రేవాల్ నిందితుడిపై నేరాభియోలు నమోదు చేశారు. Also Read:


By December 11, 2019 at 08:47AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/raped-since-she-was-4-40-year-old-delhi-woman-narrates-chilling-ordeal/articleshow/72466396.cms

No comments