ఇంట్లో దించుతానని నమ్మించి.. 12 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం

తిరుపతిలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు చేసిన ఘటన మరువక ముందే జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేటు డైరీలో పాల క్యాన్లు కడిగేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా వి.కోట మండలం పెద్దబరిణేపల్లి సమీపంలోని పాల కేంద్రంలో క్యాన్లు కడిగేందుకు 12 ఏళ్ల బాలిక వచ్చేది. నక్కనపల్లెకు చెందిన మునిరత్నం కుమారుడు రాధాకృష్ణ తన ఆటోలో గ్రామాల నుంచి పాల క్యాన్లను తీసుకొచ్చి కేంద్రంలో దింపుతుంటాడు. అయితే ఆదివారం రాత్రి పని ముగిశాక ఇంట్లో దింపుతానని బాలికను రాధాకృష్ణ ఆటోలో తీసుకెళ్లాడు. మార్గమధ్యంలోని మామిడితోటలోకి బాలికను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. రాత్రి 10 గంటల సమయంలో బాలికను తీసుకుని రాధాకృష్ణ గ్రామంలోకి రాగా, గమనించిన ఆమె చిన్నాన్న ఈ సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నవంటూ ప్రశ్నించగా డ్రైవర్ పరారయ్యాడు. Also Read: తర్వాత తనపై జరిగిన అఘాయిత్యంపై బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. ఈ దారుణంపై సోమవారం ఉదయం పాల కేంద్రం వద్దకు వచ్చిన ఆటో డ్రైవర్తో బాలిక తల్లితండ్రులు, బంధువులు మాట్లాడేందుకు ప్రయత్నించగా, రాధాకృష్ణ తప్పు ఒప్పుకోకపోగా.. బాలిక తండ్రిపై దాడికి దిగాడు. దీంతో గ్రామస్తులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అర్బన్ సీఐ యతీంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. Also Read:
By December 10, 2019 at 02:03PM
No comments