Breaking News

మరిదితో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉన్నాడని భర్తకు విషం పెట్టిన భార్య


భర్త కళ్లుగప్పి మరదితో రాసలీలలు కొనసాగిస్తున్న మహిళ కట్టుకున్నోడినే చంపేందుకు యత్నించిన ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో వెలుగులోకి వచ్చింది. భోపాల్‌లోని ఓ ప్రాంతంలో నివసించే రాజేశ్(పేరు మార్చాం) భార్యతో కలిసి ఉంటున్నాడు. అతడి తమ్ముడు సురేశ్ చదువు నిమిత్తం కొద్ది నెలలుగా అన్న ఇంట్లోనే ఉంటున్నాడు. వ్యాపారం చేసే రాజేశ్ చాలా రోజుల పాటు ఇతర ప్రాంతాలకు వెళ్తుండేవాడు. Also Read: ఇదే అదనుగా భావించిన అతడి భార్య మరిదిని రెచ్చగొట్టి పెట్టుకుంది. రాజేశ్ లేని సమయంలో వదినా మరిదులు రాసలీలలు కొనసాగించేవారు. కొద్దిరోజుల తర్వాత వారిద్దరూ చాలా సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన రాజేశ్ నిఘా పెట్టాడు. ఈ క్రమంలోనే వారి మధ్య శారీరక సంబంధం కొనసాగుతున్నట్లు అతడికి తెలిసింది. తన తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం సరికాదని చెప్పినా ఆమె వినలేదు. Also Read: భార్య పద్ధతి మార్చుకోకపోవడంతో రాజేశ్ తన తమ్ముడిని ఇంట్లో నుంచి పంపేశాడు. దీంతో తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా చంపేయాలని ఆమె నిర్ణయించుకుంది. మంగళవారం రాత్రి భర్త తింటున్న అన్నంలో విషం కలిపి పెట్టింది. సగం అన్నం తర్వాత రాజేశ్ కడుపులో తిప్పడంతో అనుమానంతో వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు. అతడిని పరీక్షించిన డాక్టర్లు వెంటనే చికిత్స అందించి ప్రాణాలు కాపాడాడు. కోలుకున్న తర్వాత రాజేశ్ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By November 01, 2019 at 10:36PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/madhya-pradesh-woman-illegal-affair-with-husband-brother-she-try-to-kill-husband/articleshow/71858659.cms

No comments