NCRB 2017 Report: అఘాయిత్యాలు, సైబర్ నేరాల్లో తెలుగు రాష్ట్రాల దూకుడు

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పోటీపడుతున్న తెలుగు రాష్ట్రాలు క్రైమ్ రేటులోనూ దూసుకుపోతున్నాయి. నేరాల కట్టడికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, పోలీసులు చెబుతున్నా వాస్తవరూపంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. మహిళలపై అఘాయిత్యాలు, మానవ అక్రమ రవాణాలో తెలంగాణలో మూడో స్థానంలో నిలవగా, సైబర్ నేరాలు, మహిళలపై అత్యాచారాలు, ఆర్థిక మోసాలు వంటి వాటిలో ఏపీ 7వ స్థానంలో నిలిచింది. వృద్ధ తల్లిదండ్రులపై పైశాచికం ప్రదర్శిస్తున్న వారున్న రాష్ట్రాల జాబితాలోనూ నాలుగో స్థానంలో ఉంది. Also Read: నేరాలకు సంబంధించి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు టాప్-10లో నిలిచినట్లు ఎన్సీఆర్బీ-2017 నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏటా నమోదైన కేసుల ఆధారంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) మరుసటి ఏడాది ఆయా రాష్ట్రాల్లో నేరాల స్థాయిని అంచనా వేస్తూ నివేదిక విడుదల చేస్తుంది. తాజాగా ఎన్సీఆర్బీ విడుదల చేసిన 2017 క్రైం డేటాలో బీహార్, ఉత్తర్ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ముందు వరుసలో నిలిచాయి. మహిళల అక్రమ రవాణాలో ఏపీ ఏడో స్థానంలో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఏపీలని మహిళలు, యువతులను అపహరిస్తున్న ముఠాలు వారిని ఉత్తరాది రాష్ట్రాల్లోని వ్యభిచార కేంద్రాలకు విక్రయిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. Also Read: అంధ్రప్రదేశ్ సైబర్ నేరాల్లో ఏడో స్థానంలోనూ, మహిళలపై జరుగుతున్న నేరాల్లో 8వ స్థానంలోను నిలిచింది. గిరిజనులపై దాడుల విషయంలో 9వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో 179 హత్యలు జరిగాయని వెల్లడించింది. ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో సైబర్ నేరాల సంఖ్య అధికంగా జరుగుతున్నాయి. Also Read: మరోవైపు తెలంగాణలో ఆర్థిక నేరాల సంఖ్య పెరుగుతోంది. 2017లో దేశవ్యాప్తంగా జరిగిన ఆర్థిక నేరాల సంఖ్యలో తెలంగాణ వాటా 7.3గా నమోదైంది. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా కింద 329 కేసులు నమోదయ్యాయి. రాజధాని హైదరాబాద్ సైబర్ నేరాలకు అడ్డాగా మారుతోందని నివేదిక స్పష్టం చేసింది. నగరంలో 2016లో 291 సైబర్ కేసులు నమోదవ్వగా, 2017లో ఆ సంఖ్య 328కి పెరిగింది. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరు 2743 కేసులతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో ముంబయి(1362), జైపూర్( 685), లక్నో(608) నిలిచాయి Also Read:
By October 23, 2019 at 09:45AM
No comments