బైపోలార్ డిజార్డర్ వ్యాధితో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

హైదరాబాద్లో ఓ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడకు చెందిన పాలపర్తి రఘురామ్(35) గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ సంస్థలో టీమ్ లీడర్గా పనిచేస్తూ చందానగర్లో నివాసముంటున్నాడు. అతడికి 8ఏళ్ల క్రితం సహోద్యోగి సుజాతతో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. Also Read: సోమవారం భార్యభర్తలిద్దరూ క్యాబ్లో కలిసి ఆఫీసుకు వెళ్లారు. ఉదయం 11 గంటల సమయంలో ఆఫీసు నుంచి బయటకు వెళ్లిన రఘురామ్ విప్రో జంక్షన్లోని మంత్రి బిల్డింగ్ పైకి వెళ్లాడు. కొద్దిసేపటికే 24వ ఫ్లోర్ నుంచి కిందికి దూకేశాడు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు రఘురామ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అతడి భార్యకు సమాచారం ఇచ్చారు. Also Read: రఘురామ్ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడికి బైపోరాల్ డిజార్డర్ అనే మానసిక వ్యాధి ఉందని గుర్తించారు. ఇందుకోసమే మూడు నెలల నుంచి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. దీనికి తోడు ఇటీవల రఘురామ్ నాయనమ్మ చనిపోవడంతో మానసికంగా మరింత కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం రఘురామ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. Also Read:
By October 15, 2019 at 11:27AM
No comments