Breaking News

తిరుపతికి విమానంలో తీసుకెళ్లలేదని వివాహిత ఆత్మహత్య


తిరుపతికి విమానంలో వెళ్దామంటే భర్త కాదన్నాడన్న కోపంతో ఓ వివాహిత చేసుకుంది. గుంటూరు నగరానికి చెందిన ప్రవళ్లిక(30) 2014లో వెంకటరమణ(38) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఆదిత్య బిర్లా సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ భర్తతో కలిసి జూబ్లీహిల్స్‌లో ఉంటోంది. వీరికి నెలల వయసున్న రిత్విక అనే పాప ఉంది. ఈ నెల పాపకు పుట్టు వెంట్రకలు తీసేందుకు కుటుంబసభ్యులంతా తిరుపతికి వెళ్లేందుకు రైలు టిక్కెట్లతో పాటు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రయాణం వాయిదా పడింది. Also Read: తాజాగా తిరుపతికి వెళ్లేందుకు వెంకటరమణ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అందరం కలిసి విమానంలో వెళ్దామని ప్రవళ్లిక కోరగా భర్త వద్దన్నాడు. విమానంలో వెళితే ఖర్చు భారీగా ఉంటుందని, వారం రోజుల్లో రైలులోనే వెళ్దామని చెప్పాడు. ఈ విషయంపై మూడు రోజులుగా దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. తల్లిదండ్రులు చెప్పినట్లుగా వింటూ తన మాట వినడం లేదని ప్రవళ్లిక బుధవారం సాయంత్రం భర్తతో తీవ్రస్థాయిలో గొడవ పడింది. Also Read: భర్తపై అలిగి బెడ్‌రూ‌మ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. కోపం వచ్చినప్పుడల్లా ప్రవళ్లిక ఇలాగే చేస్తుండటంతో మామూలేనని వెంకటరమణ పట్టించుకోకుండా హాల్‌లో పడుకున్నాడు. గురువారం ఉదయం తలుపు కొట్టగా ప్రవళ్లిక తీయలేదు. ఎంతసేపు పలిచినా ఎలాంటి స్పందనా లేకపోవడంతో కిటికీలో నుంచి చూడా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో తలుపు పగులగొట్టి భార్యను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ప్రవళ్లిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By October 18, 2019 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-commits-suicide-in-hyderabad/articleshow/71641889.cms

No comments