Breaking News

హరిద్వార్‌లో పవన్ కళ్యాణ్.. వెన్ను నొప్పి తగ్గకున్నా.. ఇచ్చిన మాటకు కట్టుబడి..


గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న .. సంపద్రాయ చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయన వెన్నునొప్పి పూర్తిగా తగ్గలేదు. కానీ ఇచ్చిన మాట కోసం.. నొప్పి వేధిస్తున్నా సరే లెక్క చేయకుండా ఆయన వెళ్లారు. వాయు మార్గం ద్వారా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్ చేరుకున్న జనసేనాని.. అక్కడి నుంచి హరిద్వార్ వెళ్లారు. హరిద్వార్‌లోని మాత్రి సదన్ ఆశ్రమానికి చేరుకొని ఆ ఆశ్రమ నిర్వాహకులు స్వామి శివానంద మహారాజ్‌తో భేటీ అయ్యారు. రామన్‌ మొగసే అవార్డు గ్రహీత, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన రాజేంద్రసింగ్‌ ఇటీవల హైదరాబాద్‌‌లో జనసేన పార్టీ ఆఫీసును సందర్శించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌‌తో సమావేశమైన ఆయన.. ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్‌ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. హరిద్వార్‌ శివార్లలో ఉండే మాత్రి సదన్‌ ఆశ్రమం కేంద్రంగా.. జి.డి. అగర్వాల్‌ గంగా ప్రక్షాళన కోసం పోరాడుతూ అసువులు బాశారు. ఆశ్రమ గురూజీ స్వామి శివానంద మహరాజ్‌, వాటర్‌ మ్యాన్‌ రాజేంద్ర సింగ్‌‌లు పవన్‌ కళ్యాణ్‌‌ను సాదరంగా ఆహ్వానించి.. ఆయన తలకు సంప్రదాయ తలపాగను చుట్టారు. అనంతరం గంగా హారతి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. గంగా నదిని పరిశ్రమలు, ప్రభుత్వాలు ఏ విధంగా కలుషితం చేస్తున్నాయో ఈ సందర్భంగా శివానంద మహారాజ్‌.. పవన్‌ కళ్యాణ్‌‌కి వివరించారు. ఇదే ఆశ్రమానికి చెందిన స్వామి నిగమానంద సరస్వతి గంగా ప్రక్షాళన కోసం 115 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచారు. 30 ఏళ్ల వయసులోనే ఆయన ఆయన ప్రాణాలను అర్పించారు. గంగా నది ప్రక్షాళన కోసం దక్షిణాది నుంచి పెద్దగా మద్దతు రావడం లేదని.. పవన్ ఆ లోటును భర్తీ చేయాలని శివానంద మహారాజ్ కోరారు. ‘‘జి.డి.అగర్వాల్‌‌లో ఉన్న పోరాట స్ఫూర్తిని పవన్‌ కళ్యాణ్‌‌లో చూశాను. వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలని పిలవగానే.. ఒక్క సెకను కూడా ఆలోచించకుండా తాను తప్పక వస్తానని పవన్ చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకున్నారు. గంగా ప్రక్షాళన కోసం పవన్‌ కళ్యాణ్‌ గట్టి కృషి చేయాలని’’ రాజేంద్ర సింగ్‌ కోరారు. అనంతరం పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ... గంగను కాలుష్యానికి గురిచేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని అన్నారు. ఒక మహత్తర కార్యక్రమం కోసం జి.డి అగర్వాల్‌ ప్రాణాలు అర్పించడం నన్నెంతో కలచి వేసిందన్నారు. ఆ రోజునే తాను హరిద్వార్‌ వచ్చి జి.డి. అగర్వాల్‌ కి నివాళులు అర్పిద్దామనుకున్నానని, అయితే పోరాట యాత్రలో ఉన్నందువల్ల రాలేకపోయానని చెప్పారు.


By October 11, 2019 at 10:19AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/janasena-chief-pawan-kalyan-visits-matri-sadan-ashram-in-haridwar/articleshow/71534291.cms

No comments