Breaking News

ఉద్యోగం కోసం వచ్చిన యువతికి మత్తుమందిచ్చి రేప్.. 3నెలల పాటు అదేపని


ఉద్యోగం ఇప్పిస్తానని ఓ యువతిని నమ్మించిన ఓ వ్యక్తి ఆమెపై మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మోసగాడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసిన పోలీసులు వాటిని జైలుకు పంపించారు. Also Read: రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘడ్ జిల్లాకు చెందిన ఓ యువతి(22) బీఈడీ పూర్తిచేసి జాబ్ కోసం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లింది. అక్కడే ఓ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగాల వేట కొనసాగిస్తోంది. మూడు నెలల క్రితం పత్రికలో వచ్చిన ప్రకటన చూసిన ఆమె ఇంటర్వ్యూ కోసం ఆఫీసుకు వెళ్లింది. అక్కడ యువతిని పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. రోజూ ఏదొక కారణం చెప్పి ఆఫీసుకి రప్పించేవాడు. Also Read: ఎన్నిరోజులైనా ఉద్యోగం రాకపోవడంతో యువతి అతడిని నిలదీసింది. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసిన అతడు ఓ రోజు ఆమెకు మత్తు మందు కలిపిన జ్యూస్ ఇచ్చాడు. మత్తులోకి జారుకున్న ఆమెపై ఆఫీసులోనే చేశాడు. మెలకువ వచ్చిన యువతి తనపై జరిగిన అఘాయిత్యాన్ని తెలుసుకుని అతడిని నిలదీసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే ఉద్యోగం రాకుండా చేస్తానని బెదిరించాడు. దీనికి తోడు ఉద్యోగం వచ్చాక పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. Also Read: అప్పటినుంచి ఆమెపై రోజూ అత్యాచారానికి పాల్పడుతూ తన కోరిక తీర్చుకునేవాడు. ఇటీవల యువతి ఉద్యోగం గురించి గట్టిగా నిలదీయడంతో కనిపించకుండా పోయాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చీటింగ్, అత్యాచారం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిందితుడి అరెస్ట్ చేశారు. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.


By October 11, 2019 at 10:10AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rajasthan-woman-raped-by-man-for-3months-over-pretext-giving-job-to-her/articleshow/71526537.cms

No comments