Breaking News

బతికుండగానే భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య


మానవత్వానికి మాయని మచ్చ తెచ్చే ఘటన ఇది. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను జాలి దయ లేకుండా బతికుండగానే శ్మశానంలో వదిలేసి వెళ్లిపోయిందా ఇల్లాలు. నోట మాట రాక, తినడానికి తిండిలేక చావు కోసం ఆ శ్మశానంలో ఎదురుచూస్తూ అతడు పడుతున్న వేదన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. Also Read: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లికి చెందిన కంకటి సత్తయ్య(56)కు భార్య, యాదమ్మ, కూతురు సంతోష ఉన్నారు. కొన్నాళ్లుగా తనకున్న మూడెకరాల పొలంలోనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన కొడుకు మహేశ్ 8ఏళ్ల క్రితం అక్కడే రోడ్డుప్రమాదంలో చనిపోయాడు. కొడుకు మరణంతో కుంగిపోవడంతో సత్తయ్య ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. కొన్నాళ్ల క్రితం భర్తతో బలవంతంగా భూమి, ఇల్లుని అమ్మించిన యాదమ్మ ఆ డబ్బు తీసుకుని కూతురితో కలిసి చేవెళ్లకు వెళ్లిపోయి జీవిస్తో్ంది. Also Read: దీంతో గ్రామంలో కనీసం ఇల్లు కూడా లేకపోవడంతో సత్తయ్య డ్వాక్రా భవనంలోనే బతుకీడుస్తున్నాడు. కూలిపనులు చేసుకుంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. కొద్దిరోజులుగా సత్తయ్య ఆరోగ్యం క్షీణించడంతో గ్రామస్థులు అతడి భార్య యాదమ్మకు సమాచారం ఇచ్చారు. తాను భర్తను వదిలేశానని, అతడితో సంబంధం లేదని ఆమె చెప్పింది. అయినప్పటికీ బంధువులు, స్థానికుల ఒత్తిడితో రెండ్రోజుల క్రితం గ్రామానికి చేరుకున్న ఆమె సత్తయ్యను చెత్త తరలించే రిక్షాలో వేసి ఊరి చివరన ఉన్న శ్మశానంలో వదిలేసి వెళ్లిపోయింది. కనీసం కదల్లేని స్థితిలో ఉన్న సత్తయ్య అక్కడే దుర్భర జీవితం అనుభవిస్తూ చావు కోసం ఎదురుచూస్తున్నాడు. అతడి పరిస్థితి చూసిన కొందరు గ్రామస్థులు ఆహారం అందిస్తున్నారు. ఎండకు ఎండుతూ చలికి వణుకుతూ సత్తయ్య అనుభవిస్తున్న వేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. Also Read:


By October 17, 2019 at 09:13AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-woman-abondment-in-cemetery-while-her-husband-is-still-alive/articleshow/71624930.cms

No comments