Breaking News

రాయల్‌ రీ యూనియన్‌.. ఒకే ఫ్రేమ్‌లో బాహుబలి స్టార్స్‌


బాహుబలి స్టార్స్‌ మళ్లీ ఒకే ఫ్రేమలో కనిపించారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన భారీ చిత్రం బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ విజువల్‌ వండర్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. బాహుబలి సినిమా తొలి భాగాన్ని లండన్‌లోని ప్రతిష్టాత్మక ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించనున్నారు. మరి కొద్ది గంటల్లో జరగనున్న ఈ ప్రదర్శనకు బాహుబలి టీం అంతా హాజరవుతున్నారు. ఇప్పటికే లండన్‌ చేరుకున్న బాహుబలి టీం రాయల్‌ రీ యూనియన్‌ పేరుతో ఫోటోలను రిలీజ్ చేశారు. దర్శకుడు రాజమౌళితో పాటు చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ, బాహుబలి ప్రభాస్‌, దేవసేన అనుష్క, భల్లాలదేవుడు రానాలు కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరితో పాటు బాహుబలి చిత్రసాంకేతిక వర్గం కూడా ఈ ప్రదర్శనకు హాజరుకానుంది. Also Read: అంతేకాదు చిత్ర సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ ప్రదర్శనలో బాహుబలి నేపథ్య సంగీతాన్ని లైవ్‌లో వినిపించనున్నారు. బాహుబలితో పాటు హాలీవుడ్‌ సినిమాలు హ్యారీ పోటర్‌, బాండ్‌ మూవీ స్కైఫాల్‌లను కూడా ఈ వేదిక మీద ప్రదర్శించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆల్బర్ట్‌ హాల్‌లో ప్రతి ఏటా ఇలా ప్రతిష్టాత్మక చిత్రాలను లైవ్‌ ఆర్కెస్ట్రాతో ప్రదర్శించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఈ ఘనత సొంతం చేసుకున్న భారతీయ సినిమా బాహుబలి కావటం విశేషం. జానపద కథతో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలుగా విడుదలై ఘనవిజయం సాధించింది. తొలి భాగం 500 కోట్ల వరకు వసూళ్లు సాధించగా రెండో భాగం ఏకంగా 1800 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. భారతీయ నిర్మాతలకు భారీ చిత్రాలను నిర్మించి ధైర్యాన్ని ఇచ్చింది ఈ సినిమా. బాహుబలి ఇన్సిపిరేషన్‌తో సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా వందల కోట్లతో సినిమాలు నిర్మించేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. Also Read: బాహుబలి రెండు భాగాలను తెరకెక్కి్ంచేందుకు నాలుగేళ్లకు పైగా టైం తీసుకున్నాడు రాజమౌళి. ఈ ప్రభాస్‌ దాదాపు ఐదేళ్ల పాటు మరో సినిమాను అంగీకరించకుండా కేవలం బాహుబలి సినిమా మాత్రమే చేశాడు. తొలిసారిగా రానా ప్రతినాయక పాత్రలో నటించగా అనుష్క, తమన్నాలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. సత్యరాజ్‌, నాజర్‌, అడివి శేష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనిలు సంయుక్తంగా నిర్మించారు. Also Read:


By October 19, 2019 at 08:22AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/the-royal-reunion-baahubali-movie-team-prabhas-rana-rajamouli-in-london/articleshow/71658323.cms

No comments