Breaking News

‘కంత్రీరాజా’ రెడీ అవుతున్నాడు


కంత్రీరాజా సెన్సార్ త్వరలో, నవంబర్ రెండో వారంలో చిత్రం విడుదల

నవతరం రీల్స్ పతాకం పై తనీష్ హీరోగా నగేష్ నారదాసి దర్శకత్వంలో మధు బాబు వెల్లూర్ నిర్మాతగా, నిర్మాణంలో వున్న చిత్రం ‘కంత్రీరాజా’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సారుకు సిద్దమైన ఈ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో రిలీజ్ చేయుటకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ సంగీత దర్శకత్వంలో ఆరు పాటలు అద్భుతంగా వచ్చాయని, లవ్, ఫ్యామిలీ, యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని దర్శకులు తెలిపారు. యాక్షన్ సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్‌గా వుంటాయని ఫైట్ మాస్టర్ నందు తెలిపారు. 

త్వరలో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరిపి నవంబర్ నెలలో రిలీజ్ చేస్తామని నిర్మాత మధు బాబు వెల్లూర్ తెలిపారు. కంత్రీ రాజా యొక్క ప్రోమోస్ యూ ట్యూబ్ లో చూడగలరని, పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా వినగలరని నిర్మాత తెలియజేసారు.



By October 21, 2019 at 04:36AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47915/kantri-raja-movie.html

No comments