Breaking News

సిరిసిల్ల చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌‌గా న్యూజిలాండ్ ఎంపీ


తెలంగాణ చేనేత కార్మికుల పనితీరుకు న్యూజిలాండ్ ఎంపీ ముచ్చటపడ్డారు. భారత్‌లో పుట్టి.. న్యూజిలాండ్‌లో ఎంపీగా ఎదిగిన ప్రియాంక రాధాక్రిష్ణన్‌ను సిరిసిల్ల నేతన్నలు నేసిన చీరలు ఆకట్టుకున్నాయి. దీంతో సిరిసిల్ల చీరలను ప్రమోట్ చేయడానికి ఆమె ముందుకొచ్చారు. కేరళలో పుట్టిన ప్రియాంక.. ఇటీవల న్యూజిలాండ్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో సిరిసిల్ల చీరను కట్టుకొని పాల్గొన్నారు. హరి ప్రసాద్ అనే చేనేత కార్మికుడు తయారు చేసిన చీరను కట్టుకున్న ఆమె.. చేనేత వస్త్రాలకు ప్రచాకర్తగా ఉండటానికి అంగీకరించారని.. బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీతా విజయ్ తెలిపారు. మన గడ్డ మీద నేసిన చీర కట్టుకొని తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ప్రియాంక.. బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తమ సంస్కృతిని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుండటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో బతుకమ్మ చీరల పేరిట పేద మహిళలకు ప్రభుత్వం ఉచితంగా ఈ చీరలను పంపిణీ చేస్తోందని.. ఇలా చేయడం వల్ల చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తోందని ప్రియాంకకు సునీతా విజయ్ తెలిపారు. తెలంగాణలో చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్ ఎంపీ చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ముందుకొచ్చారు. చేనేత వస్త్రాలను ప్రమోట్ చేయడం కోసం ప్రముఖులు ముందుకొస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం.


By October 14, 2019 at 10:44AM


Read More https://telugu.samayam.com/telangana/news/new-zealand-mp-priyanca-radhakrishnan-to-promote-sircilla-sarees/articleshow/71574821.cms

No comments