Breaking News

వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని ప్రియురాలిని చంపి కాలువలో పడేశాడు


తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో ఓ వ్యక్తి తన ప్రియురాలిని చంపి కాలువలో పడేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. షికారుకు వెళ్దామని నమ్మించిన ప్రియుడు ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ప్రాణాలు తీశాడు. Also read: ఎటావా నగరంలోని సైఫైయ్ మెడికల్ యూనివర్శిటీలో నర్సింగ్ కోర్సు చదువుతున్న ఓ యువతి సెప్టెంబర్ 24వ తేదీన కనిపించకుండా పోయింది. 26వ తేదీన ఆమె భర్త మెయిన్‌పురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కాల్‌డేటాను పరిశీలించగా షాకింగ్ విషయం తెలిసింది. చివరి కాల్ ఆమె ప్రియుడుతో మాట్లాడినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ యువతి తాను కొన్నాళ్లు ప్రేమించుకున్నామని, అయితే ఆమె తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలిపాడు. పెళ్లయిన తర్వాత తాను ఒత్తిడి చేయడంతో ప్రేమ బంధం కొనసాగించిందని పోలీసులకు చెప్పాడు. Also read: అయితే ఇటీవల బంధానికి చెక్ పెట్టేద్దామని ఆమె చెప్పడంతో తట్టుకోలేకపోయానని, తనకు దక్కనికి ఎవరికీ దక్కకూడదన్న ఆలోచనతో ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు తెలిపాడు. ప్లాన్ ప్రకారం సెప్టె్ంబర్ 24న ప్రియురాలిని కారులో ఎక్కించుకుని భిటోరా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చంపేసి కాలువలో పడేశానని వెల్లడించారు. దీంతో పోలీసులు ఆ కాలువలో గాలించి యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also read:


By October 17, 2019 at 10:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/up-man-killed-his-married-girlfriend-threw-her-body-in-a-canal/articleshow/71625918.cms

No comments