మహిళ కోసం కీచులాట.. ఇద్దరు ప్రభుత్వోద్యోగుల మధ్య భగ్గుమన్న విభేదాలు

బాధ్యతాయుతమైన ప్రభుత్వోద్యోగులుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఓ మహిళతో సాన్నిహిత్యం కోసం క్రమశిక్షణ తప్పారు.పెళ్లయి పిల్లలున్న ఆ మహిళ కోసం ఒకరైతే ఏకంగా ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమైపోయారు. రూరల్ పరిపాలనా విభాగం(డీపీవో)లో చోటుచేసుకున్న ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమంది. Also Read: గుంటూరు రూరల్ పరిపాలనా విభాగం(డీపీవో)లో ఓ మహిళ మూడేళ్ల కిందట ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగంలో చేరింది. ఆమెకు పెళ్లయి పిల్లలు ఉన్నారు. ఆమెకు అక్కడే పనిచేసే వివాహితుడైన ఓ జూనియర్ అసిస్టెంట్ పరిచయమం కావడంతో ఇద్దరూ చనువుగా ఉండేవారు. కొద్దిరోజుల తర్వాత అతడు వేరే విభాగానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఓ అధికారి ఆ మహిళతో సాన్నిహిత్యం పెంచుకుని దగ్గరైనట్లు డిపార్ట్మెంట్లో ప్రచారం జరుగుతోంది. Also Read: దీంతో జూనియర్, సీనియర్ అసిస్టెంట్ల మధ్య వార్ మొదలైంది. ఆ మహిళను వదిలేయాలని ఒకరిపై ఒకరు బెదిరింపులకు పాల్పడ్డారు. మహిళలో రిలేషన్ విషయం ఆ ఇద్దరి ఇళ్లలో తెలియడంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు కారణం సీనియర్ అసిస్టెంటేనని వీడియో రికార్డ్ చేసి వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయడం కలకలం రేపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ విజయరావు జూనియర్ అసిస్టెంట్ను కాపడాలని పోలీసులను ఆదేశించారు. దీంతో ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం రాత్రి తాడేపల్లి ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక అందించాలని పరిపాలనా విభాగం ఏఎస్పీ కె.చక్రవర్తి, డీపీవో ఇన్ఛార్జి, డీఎస్పీ జి.లక్ష్మయ్యలతో ఎస్పీ విచారణ కమిటీ ఏర్పాటుచేశారు. మరోవైపు జూనియర్ అసిస్టెంట్ తనపై దాడికి పాల్పడి దుర్భాషలాడాడని సీనియర్ అసిస్టెంట్ నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Also Read:
By October 24, 2019 at 11:09AM
No comments