Breaking News

కర్నూలులో పట్టపగలే వివాహిత దారుణహత్య


పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం ఓ వివాహిత దారుణహత్యకు గురికావడం సంచలనం రేపింది. పట్టణ శివారులోని కృష్ణాజీరావు రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న నల్లపురెడ్డి చంద్ర కళావతి(50) అనే మహిళను దుండగులు దారుణంగా చంపేసి, నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. డోన్‌లోని ఐటీఐ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్‌రరెడ్డికి భార్య చంద్ర కళావతి, ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్ రెడ్డి పుణెలో, ఉదయ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. Also Read: కృష్ణాజీరావు రెవెన్యూ కాలనీలో కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న వీరు మూడు నెలల క్రితమే ఇక్కడికి మకాం మార్చారు. మంగళవారం కాలేజీకి వెళ్లిన వెంకటేశ్వరరెడ్డి మధ్యాహ్న సమయంలో భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో ఆయన మరదలు(చంద్ర కళావతి చెల్లి)కి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడమని చెప్పారు. ఆమె మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారి ఇంటికి వెళ్లి చూడగా కళావతి రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఆమె వెంకటేశ్వరరెడ్డికి ఫోన్ చేయగా హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. Also Read: కళావతి మెడలో పుస్తెల తాడు, బంగారు గొలుసు కనిపించకపోవడంతో వాటి కోసమే దుండుగులు హత్యచేసి ఎత్తుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కర్నూలు ఇన్‌ఛార్జి డీఎస్పీ బాబా ఫకృద్దీన్‌, సీసీఎస్‌ డీఎస్పీ వినోద్‌కుమార్‌, కర్నూలు త్రీ టౌన్ సీఐ ఓబులేసు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బీరువాలో బంగారు ఆభరణాలు, నగదు ఉన్నప్పటికీ దుండగులు వాటిని ముట్టకోకుండా పుస్తెలతాడు మాత్రమే తీసుకెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read: Also Read:


By October 16, 2019 at 10:53AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/50-year-old-woman-brutally-murdered-in-kurnool-town/articleshow/71608822.cms

No comments