అఫైర్కు అడ్డొస్తున్నాడని భర్త హత్యకు ప్లాన్.. బెడిసికొట్టి ప్రియుడి కూడా పోయాడు

ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు అడ్డొస్తున్నాడన్న కోపంతో ఓ మహిళ భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది. ప్రియుడితో దాన్ని అమలు చేస్తుండగా బెడిసికొట్టి అతడు కూడా చనిపోయాడు. దీంతో ఇద్దరినీ కోల్పోయిన మహిళ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. Also Read: గుజరాత్లోని కంటారా గ్రామానికి చెందిన ఖుష్బూ అనే మహిళకు కమల్ అనే వ్యక్తితో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. ఆమె స్థానిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. కొద్దినెలల క్రితం ఖుష్బూకు బ్యాంక్లో పనిచేసే తుషార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం కమల్కు తెలిసి భార్యను నిలదీయడంతో తాన తుషార్తోనే కలిసి బతుకుతానని, విడాకులు ఇచ్చేయమని ఖుష్బూ భర్తను కోరింది. దీనికి అతడు ససేమిరా అనడంతో అడ్డు తొలగించుకోవాలనుకుంది. Also Read: దసరా సెలవుల్లో బంధువుల ఇంటికి వెళ్లిన కుమారుడిని తీసుకొచ్చేందుకు సోమవారం కమల్ భార్యతో కలిసి బైక్పై బయలుదేరాడు. ఈ విషయాన్ని ఖుష్బూ ప్రియుడు తుషార్కు చెప్పింది. ప్లాన్ ప్రకారం తనకు టాయిలెట్ వస్తోందని చెప్పి ఆమె ఓ చెరువు వద్ద బైక్ ఆపించింది. అదే సమయంలో పొదల్లో దాక్కుని ఉన్న తుషార్ కత్తితో కమల్పై దాడికి యత్నించాడు. ఇద్దరూ పిడిగుద్దులు కురిపించుకుంటూ చెరువు ఒడ్డుకు చేరుకున్నారు. అదుపుతప్పిన కమల్ చెరువులో పడిపోతుండగా తుషార్ చొక్కా పట్టుకున్నాడు. దీంతో ఇద్దరూ కలిసి చెరువులో పడి ఊపిరాడక చనిపోయారు. ఒడ్డున ఉన్న ఖుష్బూ భర్త, ప్రియుడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కమల్, తుషార్ మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరి మరణాలకు ఖుష్బూనే కారణమని తెలుసుకుని ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. Also Read:
By October 24, 2019 at 11:52AM
No comments