Breaking News

దుర్గగుడిలో మహిళా కానిస్టేబుల్‌కు అవమానం.. బూతులతో రెచ్చిపోయిన సీఐ


విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల సందర్భంగా పోలీసుల ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నారు. కనీస మర్యాద లేకుండా హీనంగా చూస్తూ వారిని అవమానాలకు గురిచేస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఓ పోలీసు ఉన్నతాధికారి దురుసు ప్రవర్తన కారణంగా ఓ పోలీసు ఏకంగా అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపిన సంఘటన ఆ శాఖలో కలకలం రేపింది. ఈ ఘటన మరువక ముందే ఓ సీఐ.. మహిళా కానిస్టేబుల్‌పై బూతుల వర్షం కురిపించారు. Also Read: ఆదివారం అర్ధరాత్రి ఉత్సవాల విధుల్లో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన ఓ సీఐ.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్‌ను తీవ్రమైన పదజాలంతో దూషించారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెంది అక్కడే కన్నీరు పెట్టుకున్నారు. అయినప్పటికీ మనసు కరగని ఆ సీఐ అందరి ముందూ బూతులు తిడుతూ ఆమెను అవమానించారు. కనీసం దుర్గగుడి ఆవరణలో ఉన్నానన్న స్పృహ కూడా సీఐ ఆమె మీద రెచ్చిపోవడంతో భక్తులు కూడా ముక్కున వేలేసుకున్నారు. బాధితురాలికి అండగా నిలిచిన మరో మహిళా కానిస్టేబుల్‌పైనా ఆయన అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. Also Read: పోలీసు శాఖలో ఉన్నతస్థాయిలో ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా ఆయన ప్రవర్తించిన తీరుపై ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఏమీ ఎరుగనట్లు వ్యవహరించడం ఆశ్చర్యపరుస్తోంది. Also Read:


By October 08, 2019 at 08:09AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bhimavaram-ci-abusing-words-on-lady-conistable-in-vijayawada-durga-temple/articleshow/71485813.cms

No comments