Breaking News

మత ప్రచారకుడితో మాజీ ఎయిర్‌ హోస్టెస్‌ రాసలీలలు... వీడియో తీసి రూ.కోటి డిమాండ్


హైదరాబాద్‌లో హనీట్రాప్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. హోటల్ వ్యాపారంలో నష్టపోయిన దంపతులు ప్రముఖులను టార్గెట్ చేసుకుని వారు ఏకాంతంగా గడిపిన వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులను దంపతులను అరెస్ట్ చేసి వారి వలలో ఇంకెవరు చిక్కుకున్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. Also Read: హైదరాబాద్‌లోని మొయినాబాద్‌ ప్రాంతంలోని ఓ ప్రార్థన మందిరానికి ఆగస్టు నెలలో ఓ మహిళ(25) వచ్చింది. అక్కడి మతప్రచారకుడితో మాట కలిపి తాను సికింద్రాబాద్‌లో చిన్నారుల అనాథాశ్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పి అతడి ఫోన్ నంబర్ తీసుకుంది. అతడితో తరుచూ వాట్సాప్ చాటింగ్ చేస్తూ రెండుసార్లు వ్యక్తిగతంగా కలిసింది. మూడోసారి వండర్‌లాకు తీసుకెళ్లి అతడితో సెల్ఫీలు తీసుకుంది. Also Read: మత ప్రచారకుడు పూర్తిగా తన మాయలో పడిపోయాడని నిర్ధారించుకున్న ఆ మహిళ మోసానికి తెరదీసింది. తన భర్త హోటల్‌ వ్యాపారం చేస్తుంటాడని, విజయవాడలో ఏర్పాటుచేస్తున్న హోటల్‌లో పెట్టుబడులు పెట్టాలని అతడిని కోరగా.. ఆమెకు రూ.10లక్షలు సమర్పించుకున్నాడు. సెప్టెంబర్ నెలలో వ్యాపార విషయాలు మాట్లాడేందుకు ప్రతినిధులు వస్తున్నారంటూ వారిని శంకర్‌పల్లిలోని ఓ రిసార్టుకు తీసుకెళ్లింది. Also Read: రాత్రివేళ అతడి గదికి వెళ్లి రొమాన్స్ చేస్తూ మద్యంలో నిద్రమాత్రలు కలిపి తాగించింది. బాధితుడు నిద్రలోకి జారుకున్న తర్వాత అతడితో సన్నిహితంగా ఉన్నట్లు ఫోటోలు, వీడియోలు తీసింది. మరుసటి రోజు ఉదయం ఆమె భర్త బాధితుడి గదికి వచ్చి బాధితుడిని తుపాకీతో బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన మత ప్రచారకుడు తనను ఏమీ చేయొద్దని ప్రాధేయపడటంతో కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి బాధితుడు సరేననడంతో అగ్రిమెంట్ మీద సంతకం చేయించాడు. ఆ తర్వాతి రోజే రూ.20లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు రూ.10లక్షలు ఇచ్చాడు. మిగిలిన డబ్బలు కోసం వేధింపులు పెరగడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Also Read: దీంతో సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దంపతులిద్దరిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మత ప్రచారకుడిని ముగ్గులోకి దించిన మహిళ గతంలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసిందని, ఆమె భర్త హోటల్ వ్యాపారంలో బాగా నష్టపోవడంతో ఇద్దరూ కలిసి మోసాలకు తెరలేపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కిలేడీ గతంలో ఓ ఎన్నారైకి కూడా గాలం వేసినట్లు తెలుస్తోంది. అయితే బాధితులు పరువు పోతుందన్న భయంతో బయట పడలేదని తెలుస్తోంది. వీరి చేతిలో మోసపోయిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. Also Read:


By October 20, 2019 at 10:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-woman-her-husband-arrested-for-honey-trapping-shepherd/articleshow/71670858.cms

No comments