Breaking News

Saaho: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్


హమ్మయ్య.. పెట్టిన బడ్జెట్ వచ్చేసింది. ఇక ఎవరు ఏమనుకున్నా ఏమీ పట్టదు. రివ్యూల మాట ఎటున్నా కలెక్షన్లకు మాత్రం ఏమాత్రం కొదవలేదు. మొత్తానికి ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ అంతా కలెక్షన్ల రూపంలో వచ్చేసింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350కోట్లు(గ్రాస్) వసూళ్లు రాబట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని సాహో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. సినిమాలో మీటూ సన్నివేశాలున్నాయ్.. దర్శకుడు సుజిత్‌ని నమ్ముకుని ప్రభాస్ తప్పటడుగు వేశాడు.. అంటూ వస్తున్న కామెంట్లకు కలెక్షన్లే సరైన సమాధానం చెప్పాయి. సాహో విడుదలైనప్పుడు సినిమా ఎలా ఉందో ఎలా వచ్చిందో అన్న కంగారు, ఆత్రుత అభిమానుల్లో బాగా ఉంది. తీరా కొందరి రివ్యూలు చూస్తే సినిమా యావరేజ్‌గా ఉందని పెట్టిన బడ్జె్ట్ వస్తుందో రాదో కూడా డౌటేనన్న అనుమానం వచ్చింది. ఇప్పుడు కలెక్షన్ల రూపంలో ఎటూ పెట్టిన బడ్జెట్ అంతా వచ్చేసింది కాబట్టి ఇక ప్రభాస్ తడి గుడ్డ వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించారు. నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. బాహుబలి తర్వాత తాను చేసే సినిమా అంతటి స్థాయిలో విజయం సాధించాలని ప్రభాస్ అనుకున్నారు. అందుకే సొంత నిర్మాణ సంస్థపై ఎంత ఖర్చైనా పర్వాలేదు అనుకుని రెండేళ్ల పాటు శ్రమించారు. నెగిటివ్ టాక్, రివ్యూలకు పక్కన పెడితే ఆయన పడిన శ్రమకు ఫలితం దక్కిందనే చెప్పాలి. సినిమా ఎటూ విజయం సాధించింది కాబట్టి ప్రభాస్ ఏదన్నా పార్టీలాంటిది గ్రాండ్‌గా ఏర్పాటుచేస్తారో లేదో వేచి చూడాలి. మరోపక్క ఆయన తన 20వ సినిమాతో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్ఢే కథానాయికగా నటిస్తున్నారు. 1930ల కాలం నేపథ్యంలో దీనిని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.


By September 04, 2019 at 11:49AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rebel-star-prabhas-starrer-saaho-collects-350-crore-gross-becomes-indias-biggest-blockbuster-of-the-year/articleshow/70972431.cms

No comments