Breaking News

క్రిమినల్ కేసులో జైలు శిక్ష.. చిక్కుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే, హైకోర్టులో పిల్


హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం ఎన్నిక చెల్లదని ప్రకటించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. హరీశ్ యాదవ్ అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేశారు. 2015లో ఓ క్రిమినల్ కేసులో కింది కోర్టు మహిపాల్ రెడ్డికి రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించిందని పిటీషనర్ పేర్కొన్నారు. తీర్పు అమలు కాకుండా మహిపాల్ రెడ్డి స్టే తెచ్చుకున్నారని.. క్రిమినల్ కేసులో రెండున్నరేళ్లకుపైగా జైలు శిక్ష పడిన వ్యక్తులకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదని హరీశ్ యాదవ్ పిటీషన్లో పేర్కొన్నారు. ఈ విషయాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనకుండా మహిపాల్ రెడ్డి వాస్తవాలను దాచిపెట్టారని.. అప్పీల్ ద్వారా ఆయన స్టే పొందారు కానీ శిక్ష రద్దు కాలేదని పిటీషనర్ న్యాయస్థానానికి తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అప్పీలు కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువు ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పొడిగించకపోతే.. వాటంతట అవే రద్దు అవుతాయని పిటీషినర్ తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేయడం కోసం నామినేషన్‌ వేసిన 2018, సెప్టెంబరు 29 నాటికే మహిపాల్ రెడ్డికి అర్హత లేదని పేర్కొన్నారు. పిటీషర్ వాదనతో న్యాయస్థానం ఏకీభవిస్తే.. మహిపాల్ రెడ్డికి చిక్కులు తప్పవేమో. Read Also:


By September 29, 2019 at 12:29PM


Read More https://telugu.samayam.com/telangana/news/pil-filed-against-patancheru-mla-mahipal-reddy-in-telangana-high-court/articleshow/71358428.cms

No comments