Breaking News

కాకినాడలో క్షుద్రపూజల కలకలం.. అర్ధరాత్రి తర్వాత ఇంట్లో నుంచి అరుపులు, కేకలు


తూర్పుగోదావరి జిల్లా సమీపంలో ఆదివారం క్షుద్రపూజల కలకలం రేగింది. కాకినాడ గ్రామీణం రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని రాయుడుపాలెంలో ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున నిర్వహిస్తున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అందించగా సర్పవరం సీఐ గోవిందరాజు వెంటనే సంఘటనా స్థలానికి సిబ్బందిని పంపించారు. Also Read: శనివారం అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత ఇంట్లో నుంచి పెద్దగా కేకలు వినిపించాయని, మంత్రాలు, అరుపులతో తామంతా భయభ్రాంతులకు గురయ్యామని స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో కాల్చిన నిమ్మకాయలు, బొమ్మలు, ఇతర పూజా సామాగ్రి ఉంది. వాటిని స్వాధీనం చేసుకుని పూజలు చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. Also Read: అయితే అవి క్షుద్రపూజలు కాదని సర్పవరం ఎస్ఐ పవన్‌కుమార్ తెలిపారు. విజయనగరానికి చెందిన ఓ యువతి కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉండడంతో పూజలు చేస్తే నయమవుతుందని ప్రత్తిపాడుకు చెందిన ఎం.డి.బషీరుద్దీన్‌ రాయుడుపాలెంలోని అతడి స్నేహితుడి ఇంటిలో అర్ధరాత్రి తర్వాత పూజలు నిర్వహించినట్లు తేలిందన్నారు. బషీరుద్దీన్‌పై బైండోవర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. Also Read:


By September 30, 2019 at 10:13AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/black-magic-performing-in-kakinada-man-arrested/articleshow/71368800.cms

No comments