Breaking News

హోటల్‌లో దిగిన మహిళను బంధించి మేనేజర్ అత్యాచారం


ఓ పని నిమిత్తంపై ఢిల్లీ నుంచి వెళ్లిన మహిళపై హోటల్ మేనేజరే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని తీవ్రంగా హింసించి లైంగిక దాడికి పాల్పడమే కాకుండా రోడ్డు పక్కనే వదిలేశాడు. Also Read: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ జవహర్‌నగర్‌లోని రోడ్డు పక్కన బుధవారం రాత్రి పెట్రోలింగ్ పోలీసులు ఓ యువతి(20)ను గుర్తించారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఆమె వద్దకు వెళ్లి ఆరా తీయగా చాలా నీరసంగా కనిపించింది. జైపూర్ ఏడీసీపీ(ఈస్ట్) మనోజ్ చౌదరి ఆమెకు ఏమైనా సాయం కావాలా? అని అడగ్గా రైల్వేస్టేషన్‌కు వెళ్లాలని చెప్పింది. ఆమె పరిస్థితిపై అనుమానం వచ్చిన ఆయన ఏం జరిగిందని ప్రశ్నించగా తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిపింది. Also Read: బాధితురాలి కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన యువతి ఓ పని నిమిత్తం ఇద్దరు యువకులతో కలిసి జైపూర్ వచ్చి హోటల్‌లో దిగింది. ఆమెపై మనసుపడిన ఆ హోటల్ మేనేజర్ లైంగిక కోరిక తీర్చాలని వేధించాడు. దీనికి ఆమె నిరాకరించంతో ఆమెతో పాటు వచ్చిన యువకులను మచ్చిక చేసుకుని వారి సాయంతో గురువారం రాత్రి రూమ్‌లోనే తీవ్రంగా హింసించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను గెస్ట్‌హౌస్ నుంచి గెంటివేశాడు. దీంతో బాధితురాలు జవహర్‌నగర్‌లో రోడ్డు పక్కన దీనస్థితిలో ఉన్న సమయంలో పోలీసులు చూసి రక్షించారు. Also Read: బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గెస్ట్‌హౌస్ మేనేజర్‌తో పాటు ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ 376 (), 323 (స్వచ్ఛందంగా బాధ కలిగించడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు తన సహాయకులపై ఫిర్యాదు చేయనప్పటికీ ఆపదలో ఉన్న ఆమెను రక్షించలేదన్న కారణంతో వారిపైనా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


By September 27, 2019 at 09:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/delhi-woman-raped-in-jaipur-hotel-manager-arrested/articleshow/71322744.cms

No comments