Breaking News

గోదావరి మహా విషాదం: మరో నాలుగు మృతదేహాలు లభ్యం.. ఘటనా స్థలికి బయల్దేరిన సీఎం జగన్


తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర లాంచీ బోల్తా ఘటన పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో గల్లంతైనవారిలో ఆదివారం సాయంత్రానికి 8 మృతదేహాలు రెస్క్యూ టీమ్‌లు వెలికి తీశారు. సోమవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలను గుర్తించారు. ఇందులో నెలల వయసున్న పసి పాప కూడా ఉండటం బాధిస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదంలో గల్లంతైన వారి కోసం స్థానికులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు. ఉదయం 9.25 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో సంఘటనా స్థలానికి బయల్దేరారు. లాంచీ బోల్తా పడిన కచ్చులూరు ప్రాంతాన్ని ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు. తర్వాత రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. Read Also: దేవీపట్నం మండలం మంటూరు-కచ్చులూరు దగ్గర గండి పోచమ్మ ఆలయం నుంచి పాపికొండలకు పర్యాటకులతో వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో లాంచీలో 60మందికిపైగా పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. సుడిగుండం, లాంచీకి రాయి తగలడం వల్ల ఒక్కసారిగా లాంచీ బోల్తాపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి 27మంది సురక్షితంగా బయటపడగా.. 39 మంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. గల్లంతైన వారిలో వరంగల్‌వాసులు ఇటు లాంచీలో ఉన్న పర్యాటకుల్లో తెలంగాణవాసులు కూడా ఉన్నారు. హైదరాబాద్, వరంగల్ నుంచి వెళ్లిన కొందరు అదే లాంచీలో పాపికొండలు చూడటానికి వెళ్లారు. వీరిలో 14మంది వరంగల్‌వాసులు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన వారు కూడా కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందినవారు కూడా ఉండటంతో తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి పువ్వాడ అజయ్‌ను ఆదేశించారు. ప్రమాదం నుంచి బయటపడిన తెలంగాణ వాసులు బసికె. వెంకటస్వామి (వరంగల్‌) ఆరేపల్లి. యాదగిరి (వరంగల్‌) గొర్రె. ప్రభాకర్ (వరంగల్‌) దర్శనాల సురేష్ (వరంగల్‌) బసికె దశరథం (వరంగల్‌) ఎండీ మజ్హార్‌ (హైదరాబాద్‌) సీహెచ్‌. రామారావు (హైదరాబాద్‌) కె.అర్జున్‌ (హైదరాబాద్‌) జానకి రామారావు (హైదరాబాద్‌) సురేష్‌ (హైదరాబాద్‌) కిరణ్‌ కుమార్‌ (హైదరాబాద్‌) శివశంకర్‌ (హైదరాబాద్‌) రాజేష్‌ (హైదరాబాద్‌) ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడి.. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారిని మంత్రులు కన్నబాబు, ఆళ్లనానిలు పరామర్శించారు. బాధితుల వివరాల గురించి ఆరా తీశారు.. వారిని ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. కోలుకున్న తర్వాత సొంత ఊర్లకు పంపేలా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే ముఖ్యమంత్రి జగన్ సోమవారం ఘటనా స్థలానికి వెళ్లనున్నారు. ప్రమాదంపై ఆరా తీసి.. బాధితుల్ని పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 70మందికిపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో పర్యాటకులు చాలామంది లైఫ్ జాకెట్లు వేసుకోలేదని మంత్రులు చెబుతున్నారు. లాంచీలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతండటంతో చాలామంది జాకెట్లు వేసుకోలేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అలాగే లాంచీ నడిపిన డ్రైవర్లకు కూడా అంత అనుభవం లేదంటున్నారు. Read Also: *ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి * ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ * చనిపోయినవారికి సంతాపం తెలియజేసిన మోదీ * ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు *ఘటన బాధాకరమన్న తెలుగు రాష్ట్రాల గవర్నర్లు * బోటు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి * ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు * ప్రమాదంపై జనసేన అధినతే పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి * లాంచీ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ * ప్రమాద స్థలానికి వెళ్లాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కు ఆదేశం * పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి * విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసిన అధికారులు * విశాఖ జిల్లా నుంచి వెళ్లినవారి కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 180042500002 *పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-233-1077 * ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం * బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి * లైసెన్సులు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం * ప్రమాదంలో తిరుపతికి చెందిన మధులత, భర్త. భర్త జాడ తెలియక మధులత కన్నీరు * లాంచీలో 14మంది వరంగల్ వాసులు.. ఐదురుగు సురక్షితం.. 9మంది గల్లంతు * ప్రమాదంలో 12మంది చనిపోయినట్లు చెబుతున్న అధికారులు *గల్లంతైనవారిలో 22మంది తెలంగాణవాసులు.. వారిలో 14మంది వరంగల్ నుంచి వచ్చారు * ప్రమాదంలో ఇద్దరు లాంచీ డ్రైవర్లు నూకరాజు,తామరాజు మృతి * ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. బోటు, లాంచీ ప్రయాణాలు తాత్కాలికంగా నిలిపివేత


By September 16, 2019 at 10:08AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/godavari-boat-capsize-live-updates/articleshow/71136493.cms

No comments