Breaking News

ఒమన్‌లో రోడ్డు ప్రమాదం.. హైదరాబాదీ కుటుంబం మృతి


ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన కుటుంబం రోడ్డుప్రమాదానికి బలైపోయింది. దంపతులతో పాటు వారి కుమారుడు ప్రాణాలు కోల్పోగా.. 12నెలల చిన్నారి తీవ్రగాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనతో హైదరాబాద్‌ పాతబస్తీలోని వారి కుటుంబసభ్యుల్లో విషాదం నెలకొంది. Also Read: వరంగల్ జిల్లాకు చెందిన అజ్మతుల్లాఖాన్‌ కొంతకాలం క్రితం హైదరాబాద్‌లోని టోలిచౌకి సాలార్‌జంగ్ కాలనీకి కుటుంబంతో కలిసి వచ్చి నివాసముంటున్నాడు. అతడి కొడుకు గౌసుల్లాఖాన్(30) ఇంజినీరింగ్ చదివి దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి భార్య భార్య అయేషా(25), కుమార్తె హనీయా(4), కుమారుడు హమ్జా(ఏడాది) కూడా మస్కట్‌లో నివాసముంటున్నారు. Also Read: శుక్రవారం రాత్రి గౌసుల్లాఖాన్ కుటుంబంతో కలిసి దుబాయ్ నుంచి ఒమన్ కారులో వెళ్తుండగా వీరి వాహనాన్ని మరో కారు ఢీకొంది. ఈ ఘటనలో గౌసుల్లాఖాన్‌, అయేషా, హమ్జా ప్రాణాలు కోల్పోగా... కుమార్తె హనీయా ఐసీయూలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. వీరి కారును ఢీకొట్టిన వాహనంలో ఇద్దరు ఒమన్ జాతీయస్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఆ దేశ ప్రభుత్వాధికారిగా తెలుస్తోంది.


By September 15, 2019 at 08:07AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/road-accident-in-oman-hyderabad-family-died/articleshow/71132438.cms

No comments