Breaking News

ఆస్తికోసం అన్న కుటుంబంపైనే కుట్ర.. బర్త్‌డే కేక్‌లో విషం కలిపి ఘాతుకం


బర్త్‌డే కేక్ తిన్న తండ్రీ కొడుకు మృతిచెందిన ఘటన జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. కొమురవెల్లి మండలం అయినాపూర్‌లో రమేష్(39) అనే వ్యక్తి భార్య భాగ్యలక్ష్మి(35), కూతురు పూజిత(12), కుమారుడు రామ్‌చరణ్(9)తో కలిసి నివాసముంటున్నాడు. బుధవారం రాత్రి రామ్‌చరణ్ పుట్టినరోజు కావడంతో కుటుంబమంగా ఆనందంగా గడిపింది. Also Read: రామ్‌చరణ్ బర్త్‌డే కేక్ కట్ చేసి కుటుంబసభ్యులకు తినిపించి తానూ తిన్నాడు. కాసేపటికే వారంతా వాంతులు చేసుకోవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. రమేష్, రామ్‌చరణ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా. తల్లీకూతురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ కుటుంబంలో తీరనిశోకం మిగిలింది. Also Read: ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేక్‌లో విషం కలవడం వల్లే వారు చనిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ కేక్‌ను రమేశ్ తమ్ముడు శ్రీనివాస్ పంపించినట్లు తెలుస్తోంది. అన్నదమ్ములిద్దరికీ భూతగాదాలు నడుస్తున్నాయని, అన్న కుటుంబాన్ని అంతమొందించేందుకు అతడే కేక్‌లో విషయం కలిపి పంపించినట్లు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్తి కోసం సొంత అన్న కుటుంబాన్నే నాశనం చేసేందుకు పన్నాగం పన్నిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది.


By September 05, 2019 at 11:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/siddipet-tragedy-father-and-son-died-after-eating-birthday-cake/articleshow/70989000.cms

No comments