సీఎంను కలిసిన సింధు.. ప్రపంచ ఛాంపియన్పై జగన్ ప్రశంసలు

విజయవాడ: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. సచివాలయంలో సీఎం ఆమెకు అభినందనలు తెలియజేశారు. తెలుగమ్మాయి వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సాధించడం గర్వంగా ఉందని.. సింధుపై సీఎం ప్రశంసలు గుప్పించారు. ఈ సమయంలో సింధు తల్లిదండ్రులతోపాటు, మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. అంనతరం రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను సింధు మర్యాదపూర్వకంగా కలవనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో పీవీ సింధును సత్కరించనున్నారు. ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించిన తర్వాత తొలిసారి ఏపీకి వచ్చిన సింధుకు.. గురువారం గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, క్రీడాప్రాధికార సంస్థ (శాప్) అధికారులు సింధుకు స్వాగతం పలికారు. మరోవైపు బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్గా నిలిచిన సింధు పేరును పద్మభూషణ్ కోసం కేంద్రానికి క్రీడా శాఖ సిఫారసు చేసింది. పీవీ సింధుకి భారత మూడో అత్యున్నత పౌరపురస్కారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. 2017లోనూ సింధు పేరును క్రీడా శాఖ సిఫారసు చేసింది. కానీ అప్పుడు ఆమెకు పురస్కారం దక్కలేదు. ఈసారి మాత్రం సింధుకు పద్మభూషణ్ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం.
By September 13, 2019 at 12:22PM
No comments