Breaking News

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ఢీకొని వ్యక్తి మృతి.. మరో కారులో పరార్


నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌(టీఆర్ఎస్) కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్-శ్రీశైలం హైవే అవేర్ గేటు సమీపంలో జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కామక జగన్నాథం(40), అతని సోదరుడు లక్ష్మీనారాయణ ఏడాదిగా అవేర్‌ గేటు సమీపంలోని భాష్యం బ్లూమ్స్‌ పాఠశాల నిర్మాణ పనుల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆదివారం అన్నదమ్ములిద్దరూ తుక్కుగూడ వెళ్లివస్తూ రాత్రి సమయంలో భాష్యం స్కూల్ సమీపంలో రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ కారు జగన్నాథంను ఢీకొంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ప్రమాదానికి కారణమైన కారును అక్కడే వదిలేసిన ఎమ్మెల్యే , డ్రైవర్, గన్‌మెన్‌తో మరో కారులో పరారయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఎమ్మెల్యే తీరుపై మండిపడుతూ మృతుడి కుటుంబసభ్యులు, స్థానికులు రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో రాత్రివేళ సుమారు 5కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మహేశ్వరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను బుజ్జగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. మృతుడు జగన్నాథం కుటుంబానికి ఎమ్మెల్యే జైపాల్ యదవ్ రూ.20లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.


By September 16, 2019 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-died-in-accident-involving-mlas-car-in-nagarkurnool-district/articleshow/71143367.cms

No comments